Vishnu Manchu : భవిష్యత్ ప్రణాళిక

మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సినిమా హీరోగా, “మా” అధ్యక్షుడిగా దూసుకెళుతున్నాడు మంచు విష్ణు. అయితే కెరియర్ లో చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ట్ కిడ్ ఇప్పుడు “జిన్నా” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ఇద్దరు బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా అనంతరం మంచు విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మొట్టమొదటి సినిమా “ఢీ”.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇటీవల ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉందని మరో సినిమాని ప్రకటించారు దర్శక నిర్మాతలు.

ఇదే కాకుండా తన భవిష్యత్ ప్రణాళికను కూడా ప్రకటించారు మంచు విష్ణు. మొత్తం ఏడు సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో “ఆండ్రాయిడ్ కట్టప్ప” కూడా ఉంది. మలయాళ సినిమా “ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25” ని మంచు విష్ణు రిమేక్ చేస్తున్నారట. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఈ సినిమాలో విష్ణు నటిస్తారట. అలాగే మిగతా సినిమాల వివరాలను నవంబర్ లో ప్రకటిస్తామని చెప్పారు మంచు విష్ణు. ఈ ఏడు రీమేక్ సినిమాలలో కొన్నింటిలో తానే హీరోగా చేయనున్నారట. మ‌రికొన్ని సినిమాలు ఇత‌ర‌ హీరోలు న‌టిస్తే మంచు విష్ణు నిర్మిస్తారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు