AlluArjun : బన్నీ మూవీ నుంచీ గురూజీ ఔట్… పగ్గాలు ఆయన చేతిలోకే..!

గురూజీ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల మాంత్రికుడుగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. ఒకప్పుడు తన డైలాగులతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందో కానీ ఆయన తీసే ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే మిగులుతోంది. పైగా కాపీ కొడుతున్నాడు అనే విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల సంక్రాంతి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా పరవాలేదనిపించినా.. కథ పరంగా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇకపోతే త్రివిక్రమ్ ఈ సినిమా తర్వాత ఏ హీరోని లైన్ లో పెట్టబోతున్నారు అంటూ వార్తలు రాగా… ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాని చేయబోతున్నారు అంటే వార్తలు వినిపించాయి. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతనే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్. మరొకవైపు అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే .. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం అయిన వెంటనే ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు అంటూ వార్తలు వినిపించాయి.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ సినిమా నుంచి త్రివిక్రమ్ తప్పుకున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వాస్తవానికి బోయపాటి ఇటీవల తెరకెక్కించిన స్కంద చిత్రం నిరాశపరిచినా.. స్టార్ హీరోలకు మాత్రం ఈయనపై ఎప్పటికీ నమ్మకం అలాగే ఉంటుంది.. ఎందుకంటే బోయపాటి హీరోలను ప్రజెంట్ చేసే విధానం అలాంటిది మరి.. ఇంతకుముందే బన్నీతో బోయపాటి సరైనోడు సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరొకసారి బన్నీతో సినిమా చేస్తానని చెప్పారు . ఇక ఎట్టకేలకు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే అల్లు అర్జున్ హీరో అని ప్రకటించకపోయినా అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు అల్లు అర్జున్ తోనే ఈ చిత్రం అన్నది ఇక లాంచనంగా ప్రకటించడమే తరువాయి. కొన్ని వారాల క్రితమే బోయపాటి తాను సిద్ధం చేసిన భారీ పాన్ ఇండియా కథను బన్నీ , అల్లు అరవింద్ కి వినిపించారట..వారు కూడా ఓకే చేసినట్లు.. ఈ సినిమా తెరపైకి వస్తే ప్రభంజనం సృష్టిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే గురూజీని తప్పించి బోయపాటి చేతికి పగ్గాలు అందించినట్లు తెలుస్తోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు