Adhi purush : ప్రభాస్ పేరుని వాడుకొని తప్పించుకుంటున్న ఆదిపురుష్ టీం

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి రకరకాల వివాదాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఇండియాలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సినిమాగా టి సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఆదిపురుష్ సినిమాని మొదటి నుంచి రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించమని చెబుతూ వచ్చిన ఈ మూవీ టీం, ఆదిపురుష్ సినిమాపై వచ్చిన నెగిటివ్ రెస్సాన్స్ చూసి ఒక్కసారిగా మాట మార్చింది. తాము రామాయణం ఆధారంగా సినిమాని తీయలేదని, మూలాలు మాత్రమే అక్కడినుంచి తీసుకున్నామని చెప్తున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాకి రైటర్ గా పని చేసిన మనోజ్ ముంతషీర్ మాత్రం గతకొద్ది రోజులుగా ఆదిపురుష్ సినిమానికి సంబంధించి ఇంటర్యూలు ఇస్తూ, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో నిలుస్తున్నాడు.

ఇప్పటికే హనుమంతుడు దేవుడు కాదంటూ.. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఈయన. ఇటీవలనే తనకి ప్రాణహాని ఉందంటూ పోలీసులని ఆశ్రయించాడు. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ని మభ్య పెట్టె విధంగా ఒక కామెంట్ చేయగా, ప్రస్తుతం ఆ కామెంట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. “ప్రభాస్ సినిమాకి అయ్యే లోయెస్ట్ బిజినెస్ హిందీ సూపర్ హిట్ సినిమాకి అయ్యే బిజినెస్ తో సమానం’ అంటూ వ్యాఖ్యలు చేయగా, ప్రభాస్ ఫ్యాన్స్ మనోజ్ ముంతషీర్ పై మండిపడుతున్నారు. చేసినదంతా చేసి, ఇప్పడు ప్రభాస్ ని అడ్డుపెట్టుకుంటున్నావా అని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాని నింపేశారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు