Yatra2 : నైజాం లోనూ యాత్ర2 కి బ్రేక్..!

దివంగత YS రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర సినిమా గురించి ఆడియన్స్ కి తెలిసిందే. కొన్నేళ్ల కింద రిలీజ్ అయిన ఆ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2 రిలీజ్ కాబోతుంది. వైఎస్సార్ రెండో సారి సీఎం అయినప్పుడు మొదలుకొని ఆయన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రజలకు చేరువయ్యాడన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. వైఎస్సార్ గా మమ్ముట్టి అదే పాత్రను కంటిన్యూ చేయగా, జగన్ గా కోలీవుడ్ నటుడు జీవా నటించాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.

అయితే ట్రైలర్ చూడ్డానికి కమర్షియల్ గా బాగానే ఉన్నా, పొలిటికల్ గా మాత్రం చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఇందులో గత ప్రభుత్వాలని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ, మాటల తూటాలు పేల్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రతిపక్షాలని నిందిస్తూ తీసిన ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమే అని తెలుస్తుంది. టీజర్ రిలీజ్ చేసినపుడు కేవలం CBN గవర్నమెంట్ కి మాత్రమే టార్గెట్ గా చూపించినా, ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందులో తెలంగాణా ప్రభుత్వ పార్టీని కూడా నిందిస్తూ చూపించడంతో యాత్ర 2 ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కావడం కష్టమేనని అనిపిస్తుంది.

ఇక ట్రైలర్ లో వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకం గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇలాంటి మంచి పాయింట్లు చెప్పడం వరకూ ఒకే గాని, ప్రభుత్వాలని నిందిస్తూ ఇలాంటి సెటైరికల్ సినిమాలు తీస్తే, వర్మ సినిమాలకి వీళ్ళకి తేడా ఏంటి అని ట్రేడ్ విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనా యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ అని అంటున్నా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కావడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయినా ఒకవేళ ఇప్పుడు రిలీజ్ ని ఆపినా మరో రెండు వారాల లోపు రిలీజ్ అయినా సినిమా కి పెద్దగా డోకా ఉండదు. మరి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ టైం వరకు ఎలాంటి సమస్యలు చిత్ర యూనిట్ ఎదుర్కుంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు