Malli Pelli: అలాంటి నిర్మాత ఇలాంటి చెత్త సినిమాలు తీయడమేంటో!

ఎంఎస్ రాజు. సక్సెస్ ఫుల్ సినిమాల నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ఒక పేరున్న నిర్మాత ఆయన. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను టాలీవుడ్ కి అందించారు. 1987 లో మనవాడొస్తున్నాడు చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడకపోవడంతో కొంతకాలం సినిమాలు తీయడానికి విరామం తీసుకున్నాడు.

అయితే నిర్మాతగా సినిమాలు తగ్గించిన ఎంఎస్ రాజు డైరెక్టర్ గా మరి సినిమాలు తీయడం స్టార్ట్ చేసాడు. 2008 లో “వాన”తో దర్శకుడిగా తొలి సినిమాను తీసాడు. ఆ సినిమా కన్నడలో వచ్చిన “ముంగారు మలే” కి రీమేక్ గా తెరకెక్కింది. ఇక తన కొడుకు సుమంత్ అశ్విన్ ని హీరోగా పరిచయం చేస్తూ “తూనీగ తూనీగ” సినిమా డైరెక్ట్ చేసాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఎంఎస్ రాజు “డర్టీ హరి” అని బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకు ఉన్న పేరు చెడగొట్టుకున్నట్టు అయ్యింది. ఆ తర్వాత వచ్చిన 7డేస్ 6 నైట్స్ సినిమా కూడా రొమాంటిక్ సినిమాగా వచ్చి డిజాస్టర్ అయింది. ఇలా అన్ని చెత్త సినిమాలు తీస్తూ టాలీవుడ్ లో తన స్థాయిని పోగొట్టుకుంటున్న ఎంఎస్ రాజు తాజాగా మరో కాంట్రవర్సీ మూవీని డైరెక్ట్ చేసి షాకిచ్చారు.

గత కొంతకాలంగా సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్ర 60 ఏళ్ళ వయసులో ప్రేమించుకొని, కొన్ని రోజుల కిందట అఫిషియల్ గా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరి ప్రేమకథను సినిమాగా వాళ్ళని హీరో హీరోయిన్లుగా పెట్టే సినిమా డైరెక్ట్ చేసేసాడు ఎంఎస్ రాజు. “మళ్ళీ పెళ్లి” అనే పేరుతో ఈ సినిమా తీశారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఒకప్పుడు నిర్మాతగా గుర్తుండిపోయే మంచి సినిమాలు, బ్లాక్ బస్టర్లు తీసిన ఎంఎస్ రాజు ఇప్పుడు ఇలాంటి చెత్త సినిమాలు, వివాదాస్పద సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు