Venkatesh: సైలెంట్ గా అనుకున్నది సాధించిన వెంకీ మామ..!

రానా నాయుడు వెబ్ సిరీస్ కారణంగా హీరో విక్టరీ వెంకటేష్ ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని క్యారెక్టర్లో నటించి  విమర్శల పాలయ్యాడు. ఇటీవల రానా నాయుడు పార్ట్ 2 రాబోతోందని వార్తలు రావటంతో మరోసారి వెంకటేష్ ట్రోల్స్ కి గురయ్యాడు. ఫ్యామిలీ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వెంకటేష్ ని బూతులతో నిండిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో చూసి ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేక పోయారు.
రానా నాయుడు లాంటి సూట్ అవ్వని కంటెంట్ ఉన్న సినిమాలు, ప్రాధాన్యత లేని క్యారెక్టర్లు చేయటం కంటే తెలుగులో మంచి కథ ఉన్న సిన్మాలు చేయచ్చు కదా అన్న కామెంట్స్ వచ్చాయి. విమర్శల మాట ఎలా ఉన్నా కానీ, వెంకటేష్ కి మాత్రం పాన్ ఇండియా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఇప్పటికి వరకూ సౌత్ ఆడియన్స్ మినహా నార్త్ ఆడియెన్స్ కి పెద్దగా పరిచయం లేని వెంకటేష్ రానా నాయుడు సిరీస్ ద్వారా నార్త్ లో గుర్తింపు తెచుకోవటంతో రెండు పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం చేసుకునేందుకు రెడీ అయ్యాయని సమాచారం అందుతుంది.
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సైన్ధవ్ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మొత్తానికి విమర్శల మాట అటుంచితే, వెంకటేష్ సైలెంట్ గా పాన్ ఇండియా స్థాయి గుర్తింపు పొందటం ఒకరకంగా మంచిదే అని చెప్పాలి. వెంకీ మామ ఇకనైనా రానా నాయుడు లాంటి బోల్డ్ కంటెంట్ కి దూరంగా ఉండి మంచి సినిమాలు చేసి పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు