Pushpa: బాలీవుడ్ పై కన్నేసిన రష్మిక

నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఛలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించటంతో యంగ్ హీరోల సినిమాలకి రష్మిక ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాలో నటించింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 100కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో విజయ్ రష్మిక పెయిర్ కి కూడా మంచి పేరు వచ్చింది.

పుట్టి పెరిగింది అంత కర్ణాటకలో అయినప్పటికీ ఆమె చేసిన మూడో సినిమాకే(డియర్ కామ్రేడ్ ) తెలుగు నేర్చుకొని తన క్యారెక్టర్ కి తానే తెలుగు డబ్బింగ్ చెప్పుకుంది. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో స్టార్ హీరోల కంట పడింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రష్మిక కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ విజయాన్నినమోదు చేసింది. ఇక ఆ తరువాత నుంచి వరుస తెలుగు, కన్నడ సినిమాలతో బిజీ అయిపొయింది రష్మిక.

అయితే  రష్మిక ఇపుడు ఏకంగా బాలీవుడ్ పై కన్నేసింది. పుష్ప సినిమాతో ఇండియా వైడ్ రష్మికకి మంచి క్రేజ్ రావడంతో ఇదే అదునుగా చేసుకొని బాలీవుడ్ లో మకాం వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రష్మిక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తోన్న యానిమల్ సినిమాలో, రణ్ బీర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండటంతో మరో బాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూరి ఫెమ్ విక్కీ కౌషల్ హీరోగా లక్ష్మణ్ ఉతేక్కర్ దర్శకత్వంలో చావా అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాలో విక్కీ కౌషల్ కి జోడిగా రష్మికని తీసుకోబోతున్నారంట. అయితే ప్రస్తుతం రష్మిక పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో బిజీ గా ఉండటంతో ఈ సినిమా తరువాత ఆమె విక్కీ కౌషల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది అని సమాచారం. అయితే ఈ సినిమాతో పాటు రష్మిక, వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక సినిమా కమిటైంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు