Tollywood Actors: టాలెంట్ మాత్రమే కాదు మల్టీ టాలెంట్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరో అవ్వాలి అని అంటే కేవలం వారసత్వమే సరిపోదు. అలా అని ఒకే ఒక టాలెంట్ కూడా సరిపోదు. మల్టీ టాలెంట్ ఉండి ఉండాలి అని ముగ్గురు కుర్ర హీరోలు రీసెంట్ టైమ్స్ లో ప్రూవ్ చేస్తూ వచ్చారు. వాళ్లలో నవీన్ పోలిశెట్టి, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వీళ్ళు ముగ్గురు కేవలం నటులుగానే కాకుండా రచయితగా కూడా తమలోని ప్రతిభను బయటపెట్టారు. ఇంకా విశ్వక్ సేన్ విషయానికొస్తే తనలోని దర్శకుడుని కూడా బయటకు తీసుకొచ్చి ఫ్యాన్స్ అలరించడమే కాకుండా ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇకపోతే వీళ్ళు ముగ్గురు రీసెంట్ టైమ్స్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. నవీన్ పోలిశెట్టి చేసినవి మూడు సినిమాలైనా ఆ మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇంకా సిద్దు జొన్నలగడ్డ విషయానికొస్తే కొన్ని క్లాస్ సినిమాలు అనిపించినా, రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు సినిమాతో తన కెరియర్ గ్రాఫ్ ని అమాంతం పెంచేశాడు.
విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాను చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఫలక్ నామా దాస్, ధమ్కీ అనే సినిమాలతో తనలోని దర్శకుడు ప్రతిభని కూడా చూపించాడు.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఇద్దరు హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఆ ఇద్దరు కుర్ర హీరోలు ఎవరంటే.? ఆది సాయికుమార్, కిరణ్ అబ్బవరం వీళ్లిద్దరికి అవకాశాలైతే మంచిగా వస్తున్నాయి. కానీ ఒక అవకాశాన్ని కూడా నిలబెట్టుకోవడంలో సఫలం కావడం లేదు. మంచి స్క్రిప్ట్ ని ఎన్నుకోవడంలో కూడా మనవాళ్లు కాస్త ముందడుగు వేయాల్సి ఉంది అనిపిస్తుంది.

- Advertisement -

వీరిద్దరు వాళ్లని చూసి, వాళ్ల కెరియర్ గ్రాఫ్ ను అబ్జర్వ్ చేసి, వాళ్ళు ఎంచుకున్న స్క్రిప్టుల్ని అనలైజ్ చేసి, వీళ్ళు కూడా అటువంటి తరహా కథలను ఎంచుకుని, తమ బలాలను కనిపెట్టి తమ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా కథలతో ప్రేక్షకుల ముందుకొస్తే ఖచ్చితంగా నిలబడగలరు అనేది కొంతమంది అభిప్రాయం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు