Kriti Sanon : ఈ హీరోయిన్ కు మహేష్ బాబు ఎవరో తెలీదంట!!

స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ బాలీవుడ్ భామ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తనకు మహేష్ బాబు అంటే ఎవరో తెలియదు అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ సూపర్ స్టార్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

మహేష్ బాబు ఎవరో తెలీదా?

కృతి సనన్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి. తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన క్రూ అనే లేడీ మల్టీస్టారర్ మూవీ రిలీజ్ అయ్యింది. ఇందులో కృతితో పాటు టబూ, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే కృతి సనన్ మహేష్ బాబు అంటే ఎవరో తనకు తెలియదు అంటూ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ తాను “1 నేనొక్కడినే” అనే సినిమా చేస్తున్న సమయంలో మహేష్ బాబు అంటే ఎవరో తెలియదని చెప్పుకొచ్చింది. ఈ మూవీ చేస్తున్న సమయంలోనే ఆయన గురించి తెలుసుకున్నానని, నేనొక్కడినే మూవీ తనకు మంచి గుర్తింపు ఇచ్చిందని వెల్లడించింది కృతి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీతోనే టాలీవుడ్ లోకి కృతి ఎంట్రీ ఇచ్చింది. కానీ నేనొక్కడినే మూవీ రిజల్ట్ ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది.

మళ్ళీ టాలీవుడ్ పై ఇంట్రెస్ట్…

కృతి సనన్ హీరోయిన్ గా నటించిన మొదటి రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. మహేష్ బాబుతో నేనొక్కడినే, నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమాలు చేసింది ఈ బ్యూటీ. రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ క్రేజీ బ్యూటీకి గత ఏడాది గట్టి షాకే తగిలింది. ఆమె చేసిన పాన్ ఇండియా ప్రయత్నం బెడిసి కొట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడిగా “ఆదిపురుష్” అనే మూవీలో నటించింది. ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోకపోగా, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. పలు వివాదాలు ఈ మూవీని చుట్టుముట్టాయి.

- Advertisement -

ఈ మూవీలో కృతి సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఆ మూవీకి డైరెక్టర్ ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్, డైలాగ్స్ పై వివాదం చెలరేగింది. ఇప్పుడు టాలీవుడ్ హీరోలంతా ఫ్యాన్ ఇండియా స్టార్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మరోసారి మహేష్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించాలనే కోరికతోనే ఇప్పుడు మహేష్ బాబు గురించి కృతి ప్రస్తావించిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సీనియర్ హీరోయిన్లయిన కరీనా కపూర్, డబ్బుతో కలిసి క్రూ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజేష్ ఏ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కామెడీ, సస్పెన్స్ అంశాలతో ఉత్కంఠ భరితంగా తెరకెక్కింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు