Kriti Shetty: అందుకు ఇంకా సమయం ఉందంటున్న కుర్ర హీరోయిన్..!

అప్పట్లో ఐటమ్ సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉండేది. ఐటమ్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా క్రియేట్ చేసేవారు మేకర్స్. ఐటమ్ సాంగ్స్ లో డాన్స్ చేసే ఐటమ్ గర్ల్స్ కి హీరోయిన్స్ ని మించిన క్రేజ్ ఉండేది అప్పట్లో. రాను రాను సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి ప్రాధాన్యత తగ్గుతూ రావటంతో ఐటమ్ గర్ల్స్ ఫేడవుట్ అయిపోయారు. కానీ, పోకిరి సినిమాతో మళ్ళీ ఈ ఐటమ్ సాంగ్ ట్రెండ్ మొదలైంది టాలీవుడ్లో. అప్పటి నుండి కమర్షియల్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ తప్పనిసరైన పరిస్థితి ఏర్పడింది. విచిత్రం ఏంటంటే టాప్ హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ లో కనిపించటం మొదలు పెట్టారు. శ్రియ, కాజల్ లాంటి వారు ఐటమ్ సాంగ్ లో మెప్పించగా, పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ లో సమంత కనిపించటం సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న హీరోయిన్ కృతి శెట్టి ఐటమ్ సాంగ్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఐటమ్ సాంగ్స్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన కృతి, ప్రస్తుతానికి ఐటమ్ సాంగ్స్ అంగీకరించే పరిస్థితిలో లేనని, ఆ సాంగ్స్ లో ఎలా నటించాలో కూడా తనకు అవగాహనా లేదని చెప్పుకొచ్చింది. ఊ అంటావా సాంగ్ లో సమంత చాలా బాగా చేసిందని కితాబిచ్చింది కృతి.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో లిప్ లాక్, బోల్డ్ సీన్స్ చేసే సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డానని, మనస్ఫూర్తిగా చేయలేని విషయాలను వదిలేయటమే మంచిది అని ఆ సమయంలో తెలుసుకున్నా అని చెప్పుకొచ్చింది ఈ కుర్ర హీరోయిన్. అయితే తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతికి ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా పడలేదు. ఈ నేపథ్యంలో కృతి బోల్డ్ సీన్స్ లో నటించటానికి డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందని, ఆఫర్లు లేకనే బోల్డ్ సీన్స్ చేయటానికి ఒప్పుకుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, కృతి తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్స్ తో అవి రూమర్స్ మాత్రమే అని స్పష్టం అయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ సినిమా కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో కృతి కెరీర్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు