బద్రి సినిమాతో డైరెక్టర్ గా మారి ఇడియట్ పోకిరి వంటి బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ డైరెక్టర్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అయితే గత కొంత కాలంగా పూరి మార్క్ హిట్ లేక వెనకబడ్డాడు, ఆ మధ్య ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లో పడ్డట్టు అనిపించినా లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వటంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన ప్రాజెక్ట్ అటకెక్కింది అన్న వార్తలొచ్చాయి. దీంతో పూరి తర్వాతి సినిమా ఎవరితో చేయనున్నాడు అన్న ఆసక్తి నెలకొన్న సమయంలో ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ చేయనున్నదంటూ వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
పూరి, రామ్ ల కాంబినేషన్లో రానున్న సినిమా గురించి ‘దిమాక్ ఖరాబ్’ అనౌన్స్మెంట్ రేపు సాయంత్రం 4గంటలకు రానుందంటూ పూరి కనెక్ట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఎట్టకేలకు అఫీషియల్ గా క్లారిటీ వచ్చిన ఈ కాంబినేషన్లో రానున్న సినిమా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అన్న వార్తల్లో నిజం ఉందా లేదా అన్నది రేపు అనౌన్స్మెంట్ ద్వారా తేలనుంది. లైగర్ సినిమా తర్వాత ఛార్మి ఆస్తులు కూడా అమ్మేసుకుంది అన్న వార్తలొస్తున్న తరుణంలో మళ్లీ పూరితో కలిసి ఛార్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుండటం వల్ల ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవటం వల్ల ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాలో రామ్ అప్పటివరకు ట్రై చెయ్యని ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్ లో కనిపించి అలరించాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్, వారియర్ సినిమాలు రామ్ కి హిట్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న రామ్ కి హిట్ తప్పనిసరైన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ద్వారా హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ మళ్లీ హిట్ అందుకొని కామ్ బ్యాక్ ఇస్తారా లేదా అన్నది చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News