Aranmanai 4 : వీళ్ళ గ్లామర్ షో నే ఏకైక ప్రమోషన్!

Aranmanai 4 : ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి హర్రర్ చిత్రాలు తీయడం లో దిట్ట అని తెలిసిందే. తమిళ్ లో రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళతో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఈ మధ్య కేవలం హర్రర్ నేపథ్యం ఉన్న సినిమాలే తీస్తుండగా, అందులోనూ అరణ్మణై సిరీస్ తో వరుస హిట్లు అందుకున్నాడు. అయితే ఈ సిరీస్ లో వచ్చిన మూడో సినిమా అంతగా ఆడలేదు కానీ, ఈ హర్రర్ కామెడీ ఫ్రాంచైజీ లో అరణ్మనై4 వచ్చేసింది. ఇక చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిన ఈ నాలుగో పార్ట్ విడుదలకు తాజాగా ఏప్రిల్ 26న రిలీజ్ కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన నటి ఖుష్బూ భర్త, ఈ డైరెక్టర్ సుందర్ సి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా ఆయన నటిస్తుండగా తమిళ్ లో అదే టైటిల్(Aranmanai 4) తో రిలీజ్ అవుతూ ఉండగా, ఈ సినిమాకు తెలుగులో బాక్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక సౌత్ స్టార్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మేకర్స్ తెలుగులో కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సుందర్‌ సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. నేటివిటీ టచ్ కోసమే తెలుగు నటుల్ని తీసుకున్నారని తెలుస్తుంది.

తమన్నా రాశి గ్లామర్ షో..

ఇక ఈ సినిమాలో శివానిగా తమన్నా, శివశంకర్ గా సుందర్ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ తాజాగా పంచుకో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇట్స్ పంచుకో డే అంటూ షేర్ చేశారు. ఇక సాంగ్ లో హీరోయిన్లలిద్దరూ తమన్నా, రాశి ట్రెండీ డ్రెస్సులు ధరించి ఓ రేంజ్ లో డ్యాన్స్ చేశారు. హిప్ హాప్ తమిజా అందించిన మ్యూజిక్ కు హుక్ స్టెప్పులతో తమన్నా, రాశి అలరించారు. నడుమును ఒక ఊపు ఊపి అదరగొట్టారు. సాంగ్ మధ్యలో కొన్ని సీన్స్ కూడా చూపించారు మేకర్స్. ఇక ఈ పాటలో తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ షో మరింత అందంగా మార్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ మారగా.. తమన్నా, రాశి గ్లామర్ డోస్ అదిరిపోయిందని చెబుతున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాకి వీళ్ళ గ్లామర్ షో నే ప్లస్ పాయింట్ గా మారనుందని తెలుస్తుంది.

ముందు సిరీస్ లా అలరిస్తుందా?

ఇక ఏప్రిల్ 26న విడుదల అవుతున్న బాక్ (అరణ్మణై 4) కి ముందు చిత్రాల్లో మొదటి రెండు బాగా ఆడగా, మూడో చిత్రం అంతగా ఆడలేదు. అయినా నాలుగో పార్ట్ పై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ మూవీని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ బ్యానర్ పై ఖుష్బూ సుందర్, ఎసీఎస్ అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హిప్ హాప్ తమిజా అందిస్తున్నారు. కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తమన్నా, రాశి ఖన్నా గ్లామర్ షోనే కాకుండా సినిమా కంటెంట్ కూడా బాగుంటే ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుంది. లేదంటే రీసెంట్ గా ప్లాప్ అయిన గీతాంజలి 2 మాదిరే ఈ సినిమా పరిస్థితి అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు