సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యట్రిక్ మూవీ గుంటూరు కారం. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో చాలా రోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ చిత్రానికి ఇటీవల గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తుంది. ఓ సారి చేసిన షూటింగ్ ను క్యాన్సిల్ చేసి, కొత్త స్టోరీతో మళ్లీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన సంగతి విధితమే. ఇక మధ్యలో మహేష్ విదేశీ టూర్లు.. డైరెక్టర్ త్రివిక్రమ్.. పవన్ సినిమాలకు సాయం ఇలా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.
అయితే తాజాగా ఈ చిత్రం గురించి టాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే… గుంటూరు కారం చిత్రానికి ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఎస్ ఎస్ తమన్ ను పక్కన పెట్టారట. ఆయన స్థానంలో కోలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న అనిరుధ్, జీవి ప్రకాశ్ లలో ఒక్కరిని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే గుంటూరు కారం నుంచి థమన్ ను పక్కనపెట్టినట్టు చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.
థమన్ ను పక్కన పెట్టడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది కాపీ అనే ముద్ర. ఇతర భాషల్లో వచ్చే ట్యూన్స్ కాపీ కొట్టి తన సాంగ్స్ ను చేస్తాడని చాలా రోజుల నుంచి ఆరోపణలున్నాయి. అలాగే తమన్ చేతిలో లెక్కకు మించిన ప్రాజెక్ట్ లు ఉన్నాయి. దీంతో అన్నింటిని అడ్జెస్ట్ చేయడం కష్టమవుతుందట. దీంతో SSMB28 నుంచి చిత్ర యూనిట్ తప్పించిందని వార్తలు వినిపిస్తున్నాయి.
వీటితో పాటు మరో టాక్ వినిపిస్తుంది. గుంటూరు కారం చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడంలో థమన్ ఆలస్యం చేస్తున్నాడట. దీంతో మహేష్ బాబుకి, తమన్ కి మధ్య విభేదాలు వచ్చాయట. దీంతో మహేష్ చెప్పడంతో త్రివిక్రమ్ తప్పని పరిస్థితుల్లో తమన్ ను పక్కనపెట్టారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అందువల్లే, ఈ మధ్య ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News