Siddharth : సిద్ధార్థ్ ను చిక్కుల్లో పడేసిన ఆర్సిబీ పోస్ట్

ఆర్సిబీ టీం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడంపై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఆయనకు లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఒక్క మహిళ కూడా వీధిలోకి వచ్చి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదంటూ ఆయన ప్రశ్నించడమే వివాదానికి కారణమైంది. ఇంతకీ సిద్ధార్థ్ ఎందుకలా ట్వీట్ చేశాడు? అంటే…

కొత్త వివాదంలో సిద్ధార్థ్…
తమిళ స్టార్ సిద్ధార్థ తన సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన చేసే ట్వీట్లు ఎప్పటికప్పుడు లేనిపోని వివాదాలను సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్ 2024) గెలిచిన విషయం తెలిసిందే. ఆదివారం అంటే మార్చి 17న రాత్రి జరిగిన ఫైనల్లో స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సిబి టీం ఢిల్లీ క్యాపిటల్స్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. 2008లోనే ఐపీఎల్లోకి ఆర్సిబి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా ఆ మెగా లీగ్ ను గెలవలేకపోయింది. అయితే తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపిఎల్ రెండో సీజన్లోనే తొలి టైటిల్ సాధించి పెట్టింది. అయితే దీనిపై సిద్ధార్థ్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.

సిద్దార్థ్ ట్వీట్ ఇదే…
ఆర్సిబీ గెలుపుతో బెంగళూరులోని పలువురు అభిమానులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 16 ఏళ్లుగా ఐపీఎల్ లో గెలవని ఆర్సిబి రెండో సీజన్లోనే డబ్ల్యుపిఎల్ గెలవడం అనేది అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. దీనికి సంబంధించి పలువురు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సిద్ధార్థ అదే వీడియోను షేర్ చేసి వాళ్లలో ఒక్క మహిళ కూడా లేదు. దానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఓ మహిళల జట్టు టోర్నమెంట్ గెలిచినప్పటికీ వీధుల్లో ఒక్క మహిళ కూడా సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఇదే ఇండియాలోని పితృ సౌమ్య వ్యవస్థకు నిదర్శనం” అంటూ ట్వీట్ చేశాడు. అయితే మహిళల విజయాన్ని పురుషులు సెలబ్రేట్ చేసుకోవద్దా ఏంటి అంటూ మండిపడ్డారు నెటిజెన్లు. “పైన ఉన్న ట్వీట్ పై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇండియాలోని పబ్లిక్ ప్లేస్ లలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరు అన్నదే నా ఉద్దేశం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో… ఓ మహిళల జట్టు గెలిచిన సందర్భంలో కూడా పురుషుల్లాగే మహిళలు ఎందుకు వీధుల్లో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు అనే విషయాన్ని చెప్పాలనుకున్నా” అంటూ వాళ్ళ ప్రశ్నకు సిద్ధార్థ వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ సిద్ధార్థపై విమర్శలు ఆగడం లేదు. ఆయన అభిమానులు మాత్రం సిద్ధార్థ్ చెప్పిన దాంట్లో తప్పేముంది అంటూ ఈ హీరోను వెనకేసుకొస్తున్నారు.

- Advertisement -

సిద్ధార్థ సినిమాల విషయానికి వస్తే…
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ ఇతేడాది “చిన్నా” అనే మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. పిల్లలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 మూవీలో కూడా సిద్ధార్థ కీలకపాత్రను పోషిస్తున్నాడు. నెక్స్ట్ ఈ హీరో చేయబోయే సినిమా గురించి క్లారిటీ లేదు. మరోవైపు హీరోయిన్ అదితి రావు హైదరితో సిద్ధార్థ్ ప్రేమాయణం అనే రూమర్లు నడుస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు