RAPO: మళ్లీ పాన్ ఇండియా అంటున్న పూరి – ఈ సారి ‘డబుల్’ ఇంపాక్ట్ ఉంటుందా..?

లైగర్ సినిమాతో డిజాస్టర్ చవిచూసిన తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ పని అయిపోయింది అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే గతంలో ఆర్థికంగా, మానసికంగా అదఃపాతాళానికి పడిపోయిన స్థాయి నుండి తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకున్న పూరీపై ఒక్క డిజాస్టర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. లైగర్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి కొత్త సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను అనౌన్స్ చేశాడు పూరి. ఆ మధ్య వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అవ్వటంతో ప్రస్తుతం హీరో రామ్, డైరెక్టర్ పూరి కెరీర్లో హిట్ కీలకమైన తరుణంలో ఈ సీక్వెల్ ను ప్లాన్ చేయటం ఆసక్తి కలిగిస్తోంది.

లైగర్ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసి డైరెక్టర్ గానే కాకుండా, నిర్మాతగా కూడా నష్టం మూట కట్టుకున్నాడు. అలాంటి డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఛార్మితో కలిసి మళ్ళీ ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పూరి కాన్ఫిడెన్స్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2024 మార్చ్ 8న విడుదల కానున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవనుంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పూరి కమ్ బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. హీరో రామ్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి పెంచే విధంగా ఉంది. ఇంకా షూటింగ్ మొదలు కానీ ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ ఎవరు?, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?, వంటి వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టర్లో త్రిశూలంతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ద్వారా అయినా పూరి జగన్నాథ్ కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు