NTR: రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంటా..? – మాములు ప్లానింగ్ కాదుగా..!

టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఎలా మొదలైందో, ఎప్పుడు, ఎందుకు మొదలైందో తెలీదు కానీ, గత ఏడాది కాలంగా పాత సినిమాలను ఎదో ఒక అకేషన్ చూసుకొని రీరిలీజ్ చేస్తూ అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించగా, అప్పట్లో డిజాస్టర్ అయిన రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా ఇటీవల విడుదలై 3కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు తమ వంతు అంటూ సింహాద్రి రీరిలీజ్ తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే సింహాద్రి సినిమాను రీమాస్టర్ చేసేందుకు సుమారు 2కోట్లకు పైగా ఖర్చు చేసారని వార్తలు వస్తున్నాయి. తాజాగా సింహాద్రి రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఈవెంట్ కి ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయని అంటున్నారు. ఇదే గనక జరిగితే, రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఏకైక సినిమాగా సింహాద్రి రికార్డ్ సృష్టిస్తుంది.

అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీరిలీజ్ ద్వారా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా మే 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట ఎన్టీఆర్ అభిమానులు. గత ఏడాది కాలంగా ఇతర హీరోల సినిమాల రీరిలీజ్ కి ఫ్యాన్స్ చేసిన హంగామా చుసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, సింహాద్రి రీరిలీజ్ ద్వారా అంతకు మించి హడావిడి చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు