Nikhil: స్పై తర్వాత జాగ్రత్త పడుతున్న నిఖిల్ – నిర్మాతలకు కండిషన్స్..!

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఇటీవల స్పై సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ స్పై సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ సినిమా ఫైనల్ అవుట్ ఫుట్, ప్రమోషన్స్ విషయంలో నిర్మాతకి హీరోకి మధ్య విభేదాలు ఏర్పడటం, హడావిడిగా రిలీజ్ చేయటం వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ రిజల్ట్ ముందే ఊహించిన నిఖిల్ కొంత సమయం తీసుకొని రిలీజ్ చేయాలని నిర్మాతని కోరినప్పటికీ నిఖిల్ మాట వినకుండా సినిమా రిలీజ్ చేయటం వల్ల డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఈ రిజల్ట్ రిపీట్ కాకుండా నిఖిల్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నిఖిల్ లైనప్ లో కార్తికేయ3, ది ఇండియా హౌస్, స్వయంభు వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని నిఖిల్ డిసైడ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు స్వయంభు సినిమా విషయంలో నిర్మాతలకు పలు కండిషన్స్ కూడా పెట్టాడని తెలుస్తోంది. కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ విషయంలో తనదే తుది నిర్ణయం అని, తాను శాటిస్ఫై అయ్యాకనే సినిమా రిలీజ్ కి ప్రొసీడ్ అవ్వాలని కండీషన్ పెట్టాడట నిఖిల్.

కార్తికేయ సినిమా తర్వాత చేస్తున్న ప్రతి సినిమా కథ, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో హై స్టాండర్డ్స్ ఉండేలా చూసుకుంటున్న నిఖిల్ కి స్పై సినిమా గట్టి దెబ్బ కొట్టిందని చెప్పాలి. కథ పరంగా ప్రామిసింగ్ గా అనిపించిన స్పై సినిమా ఎక్సిక్యూషన్లో లోపాలు వల్లే డిజాస్టర్ అయ్యిందని చెప్పాలి. ఈ క్రమంలో తన తదుపరి సినిమాల విషయంలో నిఖిల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు, పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఆ సినిమాలు ఏ మేరకు అలరిస్తాయో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు