టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ వందకి పైగా సినిమాలను పూర్తి చేశారు. వెంకటేష్, నాగార్జున మాత్రం ఆ ఫీట్ సాధించలేదు. వీరిద్దరిలో 100కి దగ్గర ఉన్న హీరో నాగార్జుననే. నాగార్జున ప్రస్తుతం 99వ చిత్రం ది ఘోస్ట్ అక్టోబర్ 05న గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. యాక్షన్స్ స్పై థ్రిల్లర్ పై ఇండస్ట్రీలో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఈ సినిమా తరువాత నాగ్ నటించే 100వ సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ఈ సినిమా విషయంలో అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇక ఆ సినిమాకు చాలా స్పెషల్ కాబట్టి అందుకోసం గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. తన 100వ చిత్రానికి ఒక దర్శకుడితోనే కాకుండా నలుగురితో కథా చర్చలు జరుపుతున్నారట. ఈ తరుణంలో ఒక దర్శకుడి పేరు సినీ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో గాడ్ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మోహన్ రాజా నే నాగ్ 100వ చిత్రానికి దర్శకుడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే తెలుగులో మనుమాన్ జంక్షన్ వంటి సూపర్ హిట్ మూవీ తీశాడు. అతడు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ దాదాపు రీమేక్స్ కావడం విశేషం. ముఖ్యంగా జయం, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆజాద్ లాంటి ఎన్నో సినిమాలను తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ కూడా హిట్ సాధించారు. ఆజాద్ సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాల్లో అతని తమ్ముడు రవినే హీరోగా నటించాడు. సొంత కథతో రవి హీరోగా నటించిన తనిఒరువన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మోహన్ రాజా పేరు మారు మ్రోగిపోయింది. నాగార్జున కోసం ఆ డైరెక్టర్ ఓ ప్రత్యేక కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ డైరెక్టర్తోనే నటిస్తాడా.. లేక 100వ సినిమాకు మరో డైరెక్టర్ తో నటిస్తాడా అనేది వేచి చూడాలి మరి.