Gunturu karam: మహేష్ బాబు పై మృణాల్ ఠాకూర్ సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ గత కొద్దీ రోజులుగా నిత్యం వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం నాని30 సినిమాలో నటిస్తున్న మృణాల్, సూపర్ స్టార్ మహేష్ గురించి ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో మాటను బయట పెట్టింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్, గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. పూజా హెగ్డే మెయిన్ లీడ్ గా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా మార్పుల, చేర్పుల కారణంగా శ్రీలీల కాస్త ప్రస్తుతం మెయిన్ లీడ్ అయింది. ఇక సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుందని టాక్. అయితే నిజానికి మొదటగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మృణాల్ తీసుకుందామని ప్రొడ్యూసర్ నాగ వంశీ సూచించారట. కానీ గురూజీ కోరిక మేరకు పూజా హెగ్డే ను పెట్టవలసి వచ్చిందని టాక్.

కాగా ఇటీవలనే మృణాల్ ఠాకూర్ సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి అటెండ్ అవ్వగా యాంకర్ ఆమెని మీరు ఏ టాలీవుడ్ హీరోతో వర్క్ చేయడం డ్రీం అని అడగగా ఆమె సమాధానంగా టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలతో వర్క్ చేయడం నాకిష్టమే అని చెబుతూ కానీ డ్రీం మాత్రం మహేష్ బాబు తో సినిమా చేయడమని చెప్పుకొచ్చింది. తాను హీరోయిన్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మహేష్ సినిమా చేసే రోజు కోసం వెయిట్ చేస్తున్న అని చెప్పింది. అయితే గుంటూరు కారం సినిమా రూమర్ గురించి మృణాల్ కి ఇంకా తెలీయకుండానే ఈ మాట అనేసింది. ఇక తన డ్రీం హీరో పక్కన నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయిందని తెలిస్తే పాపం మృణాల్ ఏమైపోతుందో.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు