టాలీవుడ్ లో ఇప్పుడు వస్తున్న సీక్వెల్స్ లో మంచి క్రేజ్ ఉన్న సినిమా “టిల్లు స్క్వేర్“. గత ఏడాది సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీజే టిల్లు కి రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. ఇక డీజే టిల్లు లో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమాలో హీరోకి ఎంత పేరొచ్చిందో హీరోయిన్ కి కూడా అంతే పేరొచ్చింది.
ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతుంది. ఫస్ట్ పార్ట్ లో నటించిన సిద్ధుయే ఈ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. అయితే హీరోయిన్ మాత్రం చేంజ్ అయ్యింది. డీజే టిల్లు లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే డీజే టిల్లు లో నేహా శెట్టికి కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇవ్వడం జరిగింది. ఇక కథకి అది ఎంతో హెల్ప్ అయ్యింది. పైగా ఆ సినిమాలో నేహా శెట్టి బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు రాబోతున్న టిల్లు స్క్వేర్ లో అనుపమ రోల్ మరింత నాటుగా మాస్ గా డిజైన్ చేసారని టాక్ నడుస్తుంది. పైగా ఈ రోల్ లో అనుపమ ఇంతవరకు ఎప్పుడు కనిపించనంత గ్లామర్ గా బోల్డ్ గా కనిపిస్తుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. అయితే అనుపమ ఇప్పటివరకు రౌడీ బాయ్స్ సినిమాలో మినహా వేరే ఎందులోనూ రొమాంటిక్ సీన్లలో పెద్దగా చేయలేదు. మరి ఈ సినిమాలో ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News