Mahesh’s Guntur Kaaram
గుంటూరు కారం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో నెలకొన్న సందిగ్థత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మధ్య తమన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడని, తమన్ ప్లేస్ లో ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహబ్, భీమ్స్ ని తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే, త్రివిక్రమ్ తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారని వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ రూమర్స్ కి చెక్ పడింది. అయితే, ఇప్పుడు మశేష్ బర్త్ డే సందర్బంగా వచ్చే పోస్టర్ కి థమన్ మ్యూజిక్ ఇస్తాడా, ఆ పోస్టర్లో థమన్ పేరు ఉంటుందా ఉండదా అన్న ఆసక్తి మొదలైంది.
మొదట షూటింగ్ వాయిదా పడటం ఒక పక్క, హీరోయిన్ పూజా హెగ్డేను తప్పించటం, స్టంట్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ లను కూడా మార్చటం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషయంలో కూడా క్లారిటీ లేకపోవటంతో మహేష్ ఫ్యాన్స్ లో ఆందోళన పెంచుతోంది. గుంటూరు కారం సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాల వల్ల అసలు ఈ సినిమా పూర్తవుతుందా లేక అటకెక్కుతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.
ఈ వివాదాల నడుమ మహేష్ ఫ్యాన్స్ కి ఉపశమనం కలిగించింది ఇటీవల వినిపించిన వార్త. అయితే, మహేష్ బార్ట్ డే సందర్బంగా రిలీజ్ చేయడం కోసం థమన్ ఇప్పటికే ట్యూన్ కూడా రెడీ చేశాడని ముంబై కి వెళ్లి రికార్డింగ్ కూడా చేసి ఫారిన్ లో ఉన్న మహేష్ బాబుకి కూడా పంపించారట. ఇక మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ రెండు రోజుల్లో సింగర్స్ చేత పాడించి బర్త్ డే రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట. ఇప్పటికి మహేష్ బాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో, ఈ ట్యూన్ కూడా ఓకే కాకపోతే థమన్ ను ఈ సినిమాలో ఉంచుతారా తప్పిస్తారా అన్న ఆందోళన మొదలైంది ఫ్యాన్స్ లో.
మొదట యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయాలని ప్లాన్ చేసిన గురూజీ, ఇప్పుడు సాంగ్స్ షూట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. మొత్తానికి సినిమా ఉంటుందా అటకెక్కుతుందా అన్న సంశయంలో ఉన్న మహేష్ అభిమానులకు ఈ వార్త పెద్ద రిలీఫ్ ని ఇచ్చింది. మరి, మొదట 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి సమ్మర్ కి అయినా రిలీజ్ అవుతుందేమో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News