Mahesh’s Guntur Kaaram: మహేష్ ఫ్యాన్స్ బిజినెస్ మ్యాన్ తో అడ్జస్ట్ అవ్వాల్సిందేనా..?

Mahesh’s Guntur Kaaram

గుంటూరు కారం సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ, అప్పటి నుండి సూపర్ స్టార్ మహేష్ ( Mahesh Babu ) ఫ్యాన్స్ కి అడుగుగడుగునా నిరాశే ఎదురవుతూ వస్తోంది. సినిమా స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు మార్పులు చేయమని కోరటం వల్ల మొదట్లో డిలే అవ్వగా, ఆ తర్వాత సమ్మర్ లో ఎండ తీవ్రత కారణంగా మహేష్ బాబు రెండు సార్లు వెకేషన్ కి వెళ్లగా షూటింగ్ వాయిదా పడింది.

ఇది చాలదన్నట్టు, హీరోయిన్ పూజ హెగ్డేను తప్పించటం, స్టంట్ మ్యాన్, సినిమాటోగ్రాఫర్ ని కూడా తప్పించటం, ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను కూడా తప్పించారని టాక్ రావటంతో ఇక ఈ సినిమా అటకెక్కినట్లే అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే, ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ తమన్ ని కలిసి మ్యూజిక్ డిస్కషన్స్ జరిపాడని వార్తలు రావటంతో సినిమాపై ఫ్యాన్స్ ఆశలు సజీవం అయ్యాయి.

సినిమా షూటింగ్ కూడా ఆగస్టు 16 నుండి స్టార్ట్ చేశేదుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇక పోతే, ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందని భావించారు ఫ్యాన్స్. తమన్ కొన్ని ట్యూన్స్ రెడీ చేసినప్పటికీ మహేష్ ఫారిన్ నుండి ఇంకా రిటర్న్ కాకపోవటం వల్ల సాంగ్ లాంటి అప్డేట్ ఏది ఉండదని తెలుస్తోంది.

- Advertisement -

ఇక మహేష్ ఫ్యాన్స్ బిజినెస్ మ్యాన్ రీరిలీజ్ తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహేష్ బాబు ని డిఫరెంట్ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేసిన ఈ సినిమాకి ఇప్పటికీ రిపీట్ మోడ్ లో చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మహేష్ బర్త్ డే సందర్బంగా రీరిలీజ్ అవుతున్న ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా న్యూ రిలీజ్ సినిమాలతో సమానంగా ఉన్నాయి. మొత్తానికి గుంటూరు కారం డిలే వల్ల నిరాశలో ఉన్న మహేష్ ఫ్యాన్స్ కి బిజినెస్ మ్యాన్ రీరిలీజ్ కాస్త రిలీఫ్ ఇస్తుందనే చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు