Shobhan Babu: శోభన్ బాబు మరదల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న కృష్ణ.. అదే అడ్డొచ్చిందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ, ఆంధ్ర అందగాడు శోభన్ బాబు ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కూడా విడివిడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేర్ చేశారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన మహాసంగ్రామం, విచిత్ర కుటుంబం, బంగారుబాబు, ఇద్దరు దొంగలు వంటి సినిమాలలో వీరు కలిసి నటించగా ఈ సినిమాలు తీసే సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా కుదిరింది.

అంతేకాదు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కృష్ణ ఎప్పుడూ ముందుండేవారని.. ఆ లక్షణమే శోభన్ బాబుకు కృష్ణను దగ్గర చేసిందని సమాచారం. ఇకపోతే కృష్ణ కొద్ది రోజులపాటు శోభన్ బాబు ఇంట్లో ఉంటూ సినిమాలు చేసేవారు. అదే సమయంలో కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ కూడా ఒకరికొకరు తమ కష్టాలను షేర్ చేసుకుంటూ ఉండేవారు . అలా కొద్ది రోజుల తర్వాత శోభన్ బాబు ఇంటికి తన మరదలు కూడా వచ్చింది.ఆ మరదలు అంటే శోభన్ బాబుకి చాలా అభిమానం.. ఆమెను ఒక బావ లాగా కాకుండా తండ్రిలాగా చూసుకునే వారట. అంతేకాదు ఆమెను బాగా చదివించారు కూడా..ఇక పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేద్దామా అని ఆలోచిస్తుండగా.. కృష్ణ గుర్తుకు వచ్చాడని సమాచారం. కృష్ణ మంచి మనసు, కష్టపడే తత్వము, దేనికైనా తెగించే ఆటిట్యూడ్ అవన్నీ నచ్చడంతో తన మరదల్ని కృష్ణకిచ్చి పెళ్లి చేద్దామని శోభన్ బాబు అనుకున్నారు.

ఇదే విషయాన్ని కృష్ణకి చెప్పకుండా ఆయన తల్లికి చెప్పారట శోభన్ బాబు. ఇక కృష్ణ తల్లి ఘట్టమనేని నాగరత్నమ్మ శోభన్ బాబు మరదలు గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని ఆమె ఫోటోని కూడా ఇంటికి తెప్పించుకుందట.. అయితే అమ్మాయి కాస్త నల్లగా కనిపించేసరికి తన అబ్బాయికి తెల్ల పిల్లని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు శోభన్ బాబుకు తెలిపిందట నాగరత్నమ్మ. ఇక అలా కలర్ వల్ల వీరి పెళ్లి ఆగిపోయిందని సమాచారం. ఇక తర్వాత కాలంలో కృష్ణ తన మేనమామ కూతురు ఇందిరా దేవి ని వివాహం చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు