Bhola shnkar: వరుస ప్రాజెక్ట్ లతో మళ్ళీ బిజీ అవుతున్న మహానటి

కీర్తి సురేష్ మళ్ళీ బిజీ అవుతుంది. మహానటి గా తెలుగు ఆడియన్స్ మెప్పించిన కీర్తి ఓ దశలో తెలుగులో టాప్ హీరోయిన్ గా ముద్ర వేసి భారీ సినిమాలు చేసింది. అయితే ఒకానొక దశలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ అయ్యి పెద్ద ఆఫర్లను అనుకోకుండా వదులుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాను నటించిన ఫిమేల్ లీడ్ సినిమాలు ప్లాప్ అవడంతో ఆఫర్లు రావడ తక్కువయ్యాయి. అందువల్ల కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేయాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు కీర్తి సురేష్ కెరీర్ మళ్ళీ గాడిలో పడినట్టుంది. ఈ మధ్యే నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కీర్తి యమా బిజీ అవుతుంది. చేతిలో ఐదు ప్రాజెక్టులతో బిజీ గా ఉంది. తెలుగులో ఇప్పటికే భోళా శంకర్ లో చిరు చెల్లెలిగా ప్రత్యేక పాత్రలో నటించగా, ఆ సినిమా ఆగష్టు 11న విడుదలకు రెడీ అవుతుంది. ఇక తమిళ్ లో ఏకంగా నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అందులో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన మామన్నన్ ఇప్పటికే విడుదలకు సిద్ధం అవగా, మిగతా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

ఇక ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ కాకుండా వేరే ఏ సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే లేటెస్ట్ గా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. గేమ్ చేంజర్ తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నదన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు గాని, ఇదే గాని నిజమైతే కీర్తి సురేష్ టాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయం అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు