Karthikeya 2 : రిలీజ్ కు మళ్లీ బ్రేక్ ?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో హీరో నిఖిల్ దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ కార్తికేయ- 2. చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైంది. గతేడాదే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ దశలోనే వాయిదా పడుతూ వచ్చింది. అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై 22న రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించినా, అది సాధ్యం కాలేదు. ఇటీవలే కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్ర బృందం.

ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అయితే తాజాగా ఆగస్టు 12న కాకుండా ఒకరోజు వెనుకకు అంటే 13వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తుందట కార్తికేయ- 2 టీం. అయితే, కార్తికేయ 2 ఒకరోజు వెనుకకు పోవడానికి కారణం దిల్ రాజు అని తెలుస్తోంది. 12న మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా విడుదల కానుంది.

మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 సినిమాలకు దిల్ రాజుయే డిస్ట్రిబ్యూటర్. రెండు ఒకే రోజు సినిమాలు విడుదల చేస్తే.. తనకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని దిల్ రాజు భావిస్తున్నాడని టాక్. దీంతో వాయిదాకు కార్తికేయ 2 చిత్ర బృందాన్ని దిల్ రాజు ఒప్పించినట్లు తెలుస్తోంది. కాగా, కొంతకాలంగా దిల్ రాజుకు వరుస షాకులు తగులుతున్నాయి. దిల్ రాజు నిర్మించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇటీవలే నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే కార్తికేయ 2 సినిమాను ఒకరోజు వెనుకకు రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారట. మరికొన్ని క్షణాల్లోనే క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు