SSMB28: గురూజీ టైటిల్స్ గేమ్ కి కారణం ఇదేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఆదిలోనే హంసపాదు అన్నట్టు షూటింగ్ వాయిదా పడింది. మే 31న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుండగా సినిమా టైటిల్ పై ఇంకా క్లారిటీ రాకపోవటం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’ వంటి మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ మూడు టైటిల్స్ లో ఒకటి ఖరారు చేస్తారని, ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేస్తారని అంటున్నారు.

గతంలో అలవైకుంఠ పురంలో సినిమా సమయంలో కూడా ఇలాగే టైటిల్ విషయంలో తెగ ప్రచారం జరిగింది, చివరికి ప్రచారంలో ఉన్న టైటిల్స్ కాకుండా వేరే టైటిల్ ఖరారు చేశాడు గురూజీ. టైటిల్స్ విషయంలో గందరగోళం పక్కన పెడితే, ఈ ప్రచారం వల్ల సినిమా షూటింగ్ దశలో ఉండగానే కావాల్సినంత హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం జరిగి ఆగిపోవడంతో నెగిటివ్ ఇంప్రెషన్ పడింది ఆ మధ్య, ఈ విషయంలో నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చినప్పటికీ గాసిప్స్ ఆగలేదు. దీంతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే సమయానికి సినిమాపై ఆసక్తి పెంచాలనే ఈ టైటిల్స్ గేమ్ మొదలు పెట్టారని అంటున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు ఇదివరకు చూడని డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్ మాడ్యులేషన్ తో కనిపిస్తాడని వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లో  మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 2024 జనవరి 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాలతో నడుమ రాబోతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు