Farhana: క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య – రష్మిక ఫ్యాన్స్ ఇకనైనా వదిలేస్తారా..?

ఐశ్వర్య రాజేష్, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ, ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్న హీరోయిన్. ఇటీవలే ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటించిన ఫర్హానా సినిమా విడుదలైంది, ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మీడియా సమావేశంలో పాల్గొన్న ఐశ్వర్య, పుష్ప సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ సినిమాలో శ్రీవల్లి  పాత్రకి తాను సరిగ్గా సూట్ అవుతాను అంటూ తన అభిప్రాయం వెల్లడించింది. ఈ వ్యాఖ్యలను రష్మిక అభిమానులు మరో రకంగా అర్థం చేసుకున్నారు. శ్రీవల్లి పాత్రను రష్మిక కంటే తానే బాగా చేయగలనని ఐశ్వర్య అన్నట్టు భావించిన రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో ఐశ్వర్యపై నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకపడ్డారు.

రష్మిక అభిమానుల ధాటికి ఖంగుతిన్న ఐశ్వర్య ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. రశ్మికను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఆ పాత్ర తనకి సూట్ అవుతుందని మాత్రమే అన్నానని చెప్పుకొచ్చింది. రష్మిక కూడా శ్రవల్లి పాత్రలో బాగా నటించిందని అభిప్రాయం వెల్లడించింది. మొత్తానికి వివాదం మరింత ముదరకముందే ఐశ్వర్య జాగ్రత్త పడి క్లారిటీ ఇవ్వటం పట్ల నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నప్పటికీ రష్మిక అభిమానులు ఇకనైనా ట్రోల్స్ ఆపుతారా లేదా చూడాలి.

కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య తరవాత నటించిన సినిమాల్లో నటనకు మంచి ప్రశంసలే వచ్చినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ అయితే దక్కలేదు. తమిళ, మలయాళంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఐశ్వర్యకి తెలుగులో ఆమె ట్యాలెంట్ కి తగ్గ అవకాశాలైతే రాలేదని చెప్పాలి. ఇక మీదట అయినా తెలుగు ఫిలిమ్ మేకర్స్ ఐశ్వర్య ప్రతిభకు తగ్గ పత్రాలు ఇచ్చి టాలీవుడ్లో బ్రేక్ ఇస్తారో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు