Tollywood: సమంతకి మెగా ఫ్యామిలీ సాయం!

Tollywood:

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన యశోద మంచి హిట్ కాగా శాకుంతలం మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన ఖుషి మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

ఇప్పటికే తను సైన్ చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం అమెరికా వెళ్ళింది. అమెరికాలో కొన్ని నెలల పాటు ఉండనున్న సామ్ తన మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోనుంది. మయోసైటిస్ చికిత్స కోసమే సమంత అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోరుకున్న తర్వాతే ఇండియాకు రానుంది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈ మధ్య తరచూగా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులు, నెటిజన్లకు టచ్ లో ఉంటుంది.

ఇది ఇలా ఉండగా, మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం సమంత పెద్ద డాక్టర్లను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే ముందుగా అపోలో హాస్పిటల్స్ సీఈవో అయినటువంటి ఉపాసనను కలిసి తన పరిస్థితి మొత్తం సమంత తెలియజేశారని, దీనితో సమంతకు ఉపాసన చాలా ధైర్యం చెప్పి వెంటనే తన తాతయ్య గారికి విషయం తెలియజేసి విదేశాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లు అందరినీ రికమండేషన్ చేశారట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు