RulesRanjann: రాధికను టార్చర్ పెట్టిన పవన్ కళ్యాణ్ నిర్మాత కొడుకు..!

RulesRanjann:

నేహా శెట్టి.. గత కొద్ది కాలంగా ఈ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. డిజె టిల్లు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మెహబూబా సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఈమె కెరీర్ ని మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది డీజే టిల్లు అని చెప్పాలి. ఈ సినిమాలోని రాధిక పాత్రలో తన బోల్డ్ అండ్ హాట్ నెస్ తో, గ్లామర్ మెరుపులతో కుర్రకారులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.

దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మడి హవానే కొనసాగుతోంది. ఇక తాజాగా బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక త్వరలో కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్, విశ్వక్సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. రూల్స్ రంజన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు నిర్మాత ఏయం రత్నం కొడుకే ఈ జ్యోతి కృష్ణ. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది మూవీ యూనిట్.

ఈ నేపథ్యంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి కృష్ణ.. నేహా శెట్టి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను నేహా శెట్టితో గొడవ పడినట్లు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.. రూల్స్ రంజన్ సినిమాలోని “సమ్మోహనుడా” అనే సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “ఈ సాంగ్ షూటింగ్ చివరగా స్విమ్మింగ్ పూల్ లో ఓ షాట్ తీయాల్సి ఉంది. ఆ షాట్ తీస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ ఆ స్విమ్మింగ్ ఫూల్ లోని వాటర్ 5 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నాయి. దీంతో నేహని అడిగితే కచ్చితంగా చేయనని చెబుతుంది. దీంతో నేను రివర్స్ లో నువ్వు చెయ్యద్దు అని చెప్పాను. కానీ షాట్ పెట్టుకుని రెడీగా ఉన్నాను. నాకు తెలుసు చెయ్యమని చెబితే రేపు ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వే చేయమన్నావు అంటుంది. అందుకే అలా మాట్లాడాను. ఆమె చేయవద్దని నాకు కూడా ఉంది. కానీ అలా కుదరదు కదా. దీంతో చివరికి నేహా నేను చేస్తానని చెప్పింది.

- Advertisement -

అలా చాలాసేపు అందులో ఉండటం వల్ల ఫుల్ లో అంతా క్లోరిన్ వాటర్ కావడంతో ఆమె మోకాళ్లకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. అప్పటికే అరగంటకి పైగా అయ్యింది. దీంతో ఆమె త్వరగా క్లోజ్ చేయాలని అరుస్తుంది. ఒక్క ఐదు నిమిషాలు ఓర్చుకోమని చెప్పాను. కానీ ఇక తను బాధ భరించలేక బయటకి వచ్చేసింది. ఆ తర్వాత ఆమెతో గొడవ అయింది. ఆ తరువాత మూడు నెలల వరకు ఆమెతో మాట్లాడలేదు. ఇక ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ షాట్ చూసి ఇలాంటి షాట్ ఎవరూ తీయలేదని ఫీల్ అయ్యి ఆమెకు కాల్ చేసి మాట్లాడాను. నేహా సైతం ఆ షాట్ తర్వాత తాను ఏడ్చానని చెప్పుకొచ్చింది” అని తెలిపారు జ్యోతి కృష్ణ.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు