SSMB28: గురూజీ మహేష్ ఫ్యాన్స్ కి భయపడ్డాడా..?

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు సంబంధించి టైటిల్, గ్లింప్స్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట్లో అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం, ఊరికి మొనగాడు వంటి టైటిల్స్ ప్రచారం జరిగాయి. ఈ మధ్య వచ్చిన త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ అన్నీ ‘అ’ అక్షరంతో ఉండటంతో ఏ సినిమాకు అమరావతికి అటు, ఇటు అన్న టైటిల్ ఫిక్స్ చేస్తారని భావించారు చాలామంది. అయితే, సెంటిమెంట్ కి బ్రేక్ ఇస్తూ గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేశాడు గురూజీ. అంతే కాకుండా తన మార్క్ కి భిన్నంగా ఈ టీజర్లో మహేష్ బాబుని మునుపెన్నడూ లేని విధంగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాంగిల్ లో చూపించి ఆశ్చర్యపరిచాడు త్రివిక్రమ్.

త్రివిక్రమ్ లో ఈ మార్పుకి కారణం మహేష్ ఫ్యాన్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయిన తర్వాత మహేష్, త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ అయిన సమయంలో మహేష్ అభిమానులు ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో జాగ్రత్త పడ్డ మహేష్ బాబు కథ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి మార్పులు చేర్పులు చేయించాడని టాక్ ఉంది. ఈరోజు రిలిజ్ చేసిన టీజర్ చూస్తే ఆ టాక్ నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే త్రివిక్రమ్ ఫ్లేవర్ అయిన కార్పొరేట్ తళుకు బెళుకులు, ఖరీదైన బంగ్లాలు వగైరా వంటివి ఈ టీజర్లో లేకుండా పక్కా మాస్ సినిమా ఫీల్ ఇస్తుంది.

మొత్తానికి, అటు మహేష్ కి, ఇటు త్రివిక్రమ్ మార్క్ కి భిన్నంగా పూర్తి మాస్ ఎలిమెంట్స్ అండ్ ఎలివేషన్స్ తో నిండిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మాస్ ఎలిమెంట్స్ కి తోడు థమన్ ఇచ్చిన బీజీఎమ్ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తోంది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2024 జనవరి 13న రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి చాలా గ్యాప్ తీసుకొని మెగాఫోన్ పట్టుకున్న గురూజీ మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు