Guntur Kaaram: మహేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ స్థాయి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి పెరిగిన క్రమంలో హీరోలు రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రెమ్యునరేషన్ 100కోట్లు దాటగా, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న బన్నీ 80కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. ఇక RRR తర్వాత ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు 70కోట్లకు పైగానే ఛార్జ్ చేస్తున్నారట. అయితే, ఇప్పటిదాకా పాన్ ఇండియా హిట్ ఒక్కటి కూడా లేని మహేష్ బాబు రెమ్యునరేషన్ భారీగా పెంచేసాడని వార్తలొస్తున్నాయి. గతంలో 50కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న గుంటూరు కారం సినిమాకు సుమారు 100కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు వార్తలొస్తున్నాయి.

మహేష్ బాబు సినిమాలు తెలుగు మార్కెట్ వరకే పరిమితం అయినప్పటికీ యూఎస్ లో ఫ్లాప్ సినిమాకు కూడా 1మిలియన్ కలెక్ట్ చేసే స్టామినా ఉండటంతో మహేష్ బాబు డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇవ్వటానికి ప్రొడ్యూసర్స్ కూడా వెనకాడట్లేదని అంటున్నారు. 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన గుంటూరు కారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న కారణంగా సంక్రాంతికి రిలీజ్ అవ్వటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్ప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది . మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావటంతో గుంటూరు కారం సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు