పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ టచ్ తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ హై రేంజ్ లో చేస్తోంది సినిమా యూనిట్. ఇందులో భాగంగా కామికాన్ ఈవెంట్లో సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కామికాన్ ఈవెంట్ లో పాల్గొన్న తొలి సినిమాగా ఘనత సాధించింది ప్రాజెక్ట్ కే. ఈ ఈవెంట్ కి సినిమా యూనిట్ తో కలిసి ప్రభాస్, అమితాబ్, కమల్ హాజరవ్వగా హీరోయిన్ దీపికా పదుకొనె మాత్రం అటెండ్ అవ్వలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
హాలీవుడ్లో జరుగుతున్న సమ్మె కారణంగానే దీపికా ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వలేదని తెలుస్తోంది. హాలీవుడ్లో సమ్మె చేస్తున్న అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో దీపికా మెంబర్ కావటం, సమ్మె జరుగుతున్న సమయంలో ఇలాంటి ఈవెంట్స్ కి అటెండ్ అవ్వకూడదు అన్న రూల్ కారణంగానే దీపికా కామికాన్ కి దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది.
బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ అందుకున్న ప్రభాస్ కి ప్రస్తుతం నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు హిట్ అవ్వటం కీలకంగా మారింది. 2024 జనవరి 12న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతున్న ప్రభాస్ కి ఈ సినిమా మరొక పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News