Hiranyakashyap: గుణశేఖర్ కి త్రివిక్రమ్ మోసం చేశాడా ..?

హిరణ్యకశ్యప సినిమా విషయంలో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా కోసం చాలా కాలం నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. రుద్రమదేవి సినిమా తర్వాత మొదలవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా ఉండనుందని కూడా అనౌన్స్ చేశారు. అయితే, ఆ తర్వాత నిర్మాత సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టకపోవడంతో గుణశేఖర్ శాకుంతలం సినిమాలో బిజీ అయ్యాడు. ఇప్పుడు రానా కామికాన్ వేదికగా హిరణ్యకశ్యప సినిమా ప్రస్తావన తీసుకురావడం వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

త్రివిక్రమ్ ఇచ్చే స్క్రిప్ట్ తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా ఉంటుందని, డైరెక్టర్ ఎవరన్నది త్వరలోనే డిసైడ్ అవుతామని అనౌన్స్ చేయటంతో గందరగోళం మొదలైంది. మొదట్లో ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్ర ని అనుకున్నామని ఆ సమయంలో త్రివిక్రమ్ తనకి తానుగా ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తానని వచ్చాడని అన్నాడు గుణశేఖర్. డైలాగ్స్ రాస్తానంటూ వచ్చిన త్రివిక్రమ్ స్క్రిప్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని ఇప్పుడు గుణశేఖర్ ని ప్రాజెక్ట్ నుండి తప్పించాడని అంటున్నారు.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పేరు ప్రస్తావించకుండా గుణశేఖర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దేవుడి మీద సినిమా చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని గమనిస్తున్నాడన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని, అనైతిక చర్యలకు నైతికమైన పద్దతిలో సమాధానం ఉంటుందని ట్వీట్ చేశాడు గుణశేఖర్. ఈ ట్వీట్ త్రివిక్రమ్ ని ఉద్దేశించే చేసినట్లు స్పష్టం అవుతున్న క్రమంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు