Director Krish: డ్రగ్ కేస్ పై డైరెక్టర్ క్రిష్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయం మరొకసారి టాలీవుడ్ ని కుదిపేస్తోంది. రాడిసన్ పబ్ లో డ్రగ్స్ పార్టీ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చి విచారణకు రావాలని.. నోటీసులు పంపినప్పటికీ.. ఆయన హాజరు కాలేదు.. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ కోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ముఖ్యంగా క్రిష్ తో పాటు డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న రఘుచరణ్ అట్లూరి , సందీప్ లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోని డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వ్యవహారంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

డ్రగ్స్ కేసు పై స్పందించిన డైరెక్టర్ క్రిష్..
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. డ్రగ్స్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే నిందితుడిగా చేర్చారని..తాను డ్రగ్స్ తీసుకున్నాను అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని.. కావాలని.. ఉద్దేశంతోనే ఈ కేసులో ఇరికించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో జరిగిందేమిటంటే..
హైదరాబాద్ రాడిసన్ పబ్ లో డ్రగ్స్ పార్టీ కేసులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకి రాగా.. ఇప్పటికే మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద తో పాటు నిర్భర్ కేదార్ డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ లను అరెస్టు చేశారు పోలీసులు.. ఇక వారి ఫోన్ డేటా , లావాదేవీల ఆధారంగా కొంతమంది నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా బుధవారం వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అబ్బాస్ రకరకాల మార్గాలలో కొకైన్ తెచ్చి డ్రైవర్ ప్రవీణ్ కి ఇచ్చినట్టు దర్యాప్తులో తేల్చారు.. ఇక ఆ తర్వాత ప్రవీణ్ వివేకానందకు ఇచ్చేవారట. ప్రవీణ్, అబ్బాస్ ల మధ్య నగదు లావాదేవీలను కూడా పోలీసులు గుర్తించారు.. ఇకపోతే వివేకానంద ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే క్రిష్ పేరును నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ క్రమంలోని క్రిష్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపించాలని పోలీసులు భావిస్తున్నారు. కానీ క్రిష్ మాత్రం ముందస్తు బెయిల్ కోసం ఇలా కోర్టును ఆశ్రయించడం జరిగింది.

- Advertisement -

పరారీలో ఉన్న సెలెబ్రిటీలు వీళ్లే..
అయితే ఈ రాడిసన్ పబ్ డ్రగ్ కేసులో కొంతమంది సెలబ్రిటీలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
వారిలో రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి గణేష్ తదితరులు ఉన్నట్లు.. వారి ఆచూకీ ఇంకా దొరకలేదని సమాచారం.. ఇకపోతే నటి లిషి కనిపించడం లేదని ఆమె సోదరీ కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో రాడిసన్ హోటల్, మింక్ డ్రగ్ కేసులో కల్లపు కుషిత ఆమె సోదరి కల్లపు లిషి గణేష్ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి లిషి గణేష్ పట్టబడడంతో అక్కాచెల్లెళ్లకు డ్రగ్స్ కేసులో సంబంధం ఉంది అంటూ పోలీసులు భావిస్తున్నారు. అయితే త్వరలోనే నిజా నిజాలను బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు