అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన సినిమా యానిమల్.ఈ సినిమాకు సంబందించిన ప్రీ టీజర్ లుక్ తాజాగా రిలీజ్ అయ్యి సినిమాపై ఆసక్తి పెంచుతోంది. అర్జున్ రెడ్డి తరహాలోనే రణబీర్ ఇందులో రఫ్ లుక్ తో చేతిలో గొడ్డలితో మోస్ట్ వైలెంట్ గా కనిపించిన పోస్టర్ వైరల్ కాగా, ప్రీ లుక్ టీజర్ కూడా అంతే వైలెంట్ గా ఉంది. ఈ క్రమంలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. అదేంటంటే, ఈ స్టోరీని సందీప్ మన తెలుగు స్టార్ హీరోలకి వినిపించాడా లేదా, వినిపించి ఉంటే వాళ్లు ఈ స్టోరీని రిజెక్ట్ చేయటానికి కారణాలు ఏమై ఉంటాయని నెటిజన్లు చర్చిస్తున్నారు.
అర్జున్ రెడ్డి తర్వాత డైరెక్టర్ సందీప్ కి మాములు క్రేజ్ రాలేదు. ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం సంపాదించాడు. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సందీప్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఒక్క టీజర్ తోనే యానిమల్ సినిమాని జడ్జ్ చేయటం సాధ్యం కాదు. సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయితే మాత్రం మన హీరోలు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే అని చెప్పచ్చు. అయితే, సందీప్ లైనప్ లో ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా, అల్లు అర్జున్ తో మరో సినిమా ఉండటం విశేషం.
రణబీర్ కపూర్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనీల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రూపొంది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ అందరు తెలుగు డైరెక్టర్స్ తో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలో వస్తున్న ఈ సినిమా ద్వారా సందీప్ తెలుగు దర్శకుల స్థాయి పెంచుతారా లేదా అన్నది వేచి చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News