Nikhil: రిలీజ్ దగ్గరపడుతున్నా సైలెంట్ గా ఉన్న ‘స్పై’ – స్ట్రాటజీ ఏమైనా ఉందా..?

కార్తికేయ2 ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా ఎడిటర్ గ్యారీ దర్శకత్వంలో రూపొందిన సినిమా స్పై. సుభాష్ చంద్ర బోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. రిలీజ్ డేట్ లో మార్పులు ఉండబోతున్నాయని వార్తలొచ్చాయి ఆ మధ్య, అయితే వాటిని ఖండించిన సినిమా యూనిట్ అనౌన్స్ చేసిన డేట్ కే విడుదల ఉంటుందని స్పష్టం చేసింది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేసిన సినిమా రిలీజ్ డేట్ కి 20రోజులు సమయం కూడా లేని తరుణంలో ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండా సైలెంట్ గా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. పాన్ ఇండియా సినిమాలకు కనీసం మూడు వారాల ముందు నుండి ప్రమోషన్స్ చేస్తేనే గానీ, అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకు సినిమా గురించి తెలిసే అవకాశం ఉంటుంది.

అయితే, స్పై సినిమా యూనిట్ సైలెన్స్ వెనక ఒక స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. జూన్ 16న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ రిలీజ్ ఉన్న కారణంగా స్పై సినిమా ప్రమోషన్స్ అప్పటివరకు మొదలు పెట్టకూడదని డిసైడ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆదిపురుష్ యుఫోరియాలో తమ సినిమాను ఎంత ప్రమోట్ చేసినా ప్రేక్షకుడికి చేరే అవకాశం ఉండదని అందుకే ఆదిపురుష్ రిలీజ్ వరకు ఆగాలని ప్లాన్ చేశారట. ఆ సినిమా రిలీజ్ అయ్యాక మరో పదిరోజుల్లో స్పై సినిమాని రిలీజ్ చేయటం రిస్క్ అని భావిస్తున్న సినిమా యూనిట్ ఆదిపురుష్ సినిమా రిజల్ట్ ని బట్టి ప్రమోషన్స్ ప్లాన్ చేయాలనీ డిసైడ్ అయ్యారట.

ఒకవేళ ఆదిపురుష్ కి గనక దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తే, మినిమమ్ రెండు వారాల పాటు మరే సినిమాని ప్రేక్షకుడు పట్టించుకునే అవకాశం ఉండదు. పైగా అనుకున్న రేంజ్ లో థియేటర్లు దొరకటం కూడా కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ సినిమాకు హెల్ప్ అయ్యే విధంగానే ఉందని చెప్పాలి. మరి, స్పై సినిమాతో నిఖిల్ తన పాన్ ఇండియా హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు