Kishor B : శ్రీకారం దర్శకుడితో ధనుష్

Kishor B : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు మొదటి షార్ట్ ఫిలిమ్ తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత దర్శకులుగా తమకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని నేడు స్టార్ డైరెక్టర్లగా ఎదిగారు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఎంతోమంది తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా ముందు షార్ట్ ఫిలింతో తమ జర్నీని స్టార్ట్ చేసి నేడు సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నేడు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు.

ఇకపోతే అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది దర్శకులు మొదటి షార్ట్ ఫిలిమ్స్ తో తమ కెరియర్ స్టార్ట్ చేసి నేడు ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా చాలామణి అవుతున్నారు. పెళ్లిచూపులు సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తరుణ్ భాస్కర్ మొదటి సైనమా అని షార్ట్ ఫిలిం చేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో క్యూరియాసిటీతో చాలామంది వెయిట్ చేస్తున్నారని అనటంలో ఆశ్చర్యం లేదు.

అలానే శ్రీకాంత్ రెడ్డి కూడా ఆదికేశవ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. అంతకంటే ముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ను తీసాడు శ్రీకాంత్ రెడ్డి. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుదీప్ కేవీ కూడా మొదట మిస్డ్ కాల్ అనే షార్ట్ ఫిలిం చేసాడు. ఇకపోతే శ్రీకారం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు కిషోర్. మొదట ఈ సినిమాను షార్ట్ ఫిలిం గా తెరకెక్కించాడు. అయితే ఈ షార్ట్ ఫిలిం అద్భుతమైన హిట్ కావడంతో ఇదే సినిమాను సినిమాగా మలిచి దీనిని శ్రీకారం పేరుతో తెరకెక్కించారు.

- Advertisement -

ఈ సినిమా కథ విషయానికి వస్తే…

నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కార్తిక్ (శర్వానంద్) పండుగకు తన సొంత ఊరికి వస్తాడు. ఆ ఊరిలో అందర్నీ కలిసి, కొన్ని రోజులు వాళ్ళతో ఉండి మళ్ళీ నగరానికి వెళ్ళిపోతాడు. తనకి ప్రమోషన్ వచ్చి, అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా కూడా తన మనసు ఊరు, పొలం మీద ఉంటుంది. దాంతో ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయడంకోసం ఊరికి వస్తాడు. కార్తీక్ ఊరికి వచ్చేయడం అతని తండ్రి కేశవులు (రావు రమేష్) కి నచ్చదు. సరైన బతుకు లేని వ్యవసాయాన్ని నమ్ముకోవద్దని కొడుకుకు నచ్చచెప్పబోతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

ఇప్పుడు ధనుష్‌తో…

అయితే ప్రస్తుతం కిషోర్ తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదివరకే ధనుష్ తెలుగులో సార్ సినిమాతో స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కూడా సినిమాను చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమాకి కుబేర అనే టైటిల్ ను ఖరారు చేశారు. లేటెస్ట్ గా కిషోర్ బి ధనుష్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇకపోతే రీసెంట్ గా కిషోర్ ఒక యాంకర్ ను పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు