Miss Shetty Mr Polishetty: తెలుగు మూవీలో పాట పాడనున్న ధనుష్

కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇకపై తెలుగులో కూడా తన టాలెంట్ ని చూపించబోతున్నాడు. ధనుష్ ఒక నటుడిగానే కాకుండా సింగర్ కూడా పాటలు పాడాడని అని మనందరికీ తెలిసిందే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ధనుష్ నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా, లిరిక్స్ రైటర్ గా, పని చేశాడు. రీసెంట్ గా వచ్చిన “సార్” మూవీ తమిళ్ వెర్షన్ లో ధనుష్ స్వయంగా పాట రాసి పాడడం జరిగింది. “వా వాతి” అంటూ సాగే ఈ పాట మంచి హిట్ అయింది. ఈ ట్యూన్స్ కు తెలుగులో రామజోగయ్య శాస్త్రి “మాస్టారు మాస్టారు” అనే పేరుతో లిరిక్స్ రాసారు. ఈ పాటను కూడా తెలుగులో పాడాడు ధనుష్. కానీ మూవీలో మేల్ వెర్షన్ కాకుండా ఫిమేల్ వెర్షన్ ని పెట్టారు.

ఇక తాజాగా ధనుష్ ఓ తెలుగు సినిమా కోసం పాట పాడుతున్నారని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా వస్తున్న “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” మూవీలో ధనుష్ ఓ పాట పాడుతున్నారని, తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ పాట పాడనున్నారని సమాచారం. ధనుష్ ఇంతకుముందు చాలా మూవీస్ లో పాటలు పాడినా, అవన్నీ తమిళ్ సినిమాలు. ఇప్పడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో తెలుగులో పాట పాడుతున్నారు. అయితే ఈ వార్త గురించి ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

ఇక తెలుగులో వేరే ఇండస్ట్రీ హీరోలు పాట పాడటం కొత్తేమి కాదు. ఇంతకు ముందు తమిళ నటులు శింబు “బాద్ షా” మూవీ లో పాడగా, సిద్ధార్థ్ తెలుగులో చేసిన బొమ్మరిల్లు మొదలుకొని చాలా సినిమాల్లో పాడాడు. ఇప్పుడు ధనుష్ వంతు వచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు