Captain Miller : రెండు వారాల తర్వాత వస్తే ఇలాగే ఉంటుంది మరి..!

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి తమిళనాడు లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అయితే ఆక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి యావరేజ్ కలెక్షన్లను సాధించింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 26 న థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రియంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, రిపబ్లిక్ డే అడ్వాంటేజ్ తో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. తెలంగాణ, ఎపి కలిపి మొదటిరోజు 55 లక్షల షేర్ 1.05 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. అయితే ధనుష్ గత చిత్రాలతో పోలిస్తే గత ఐదారేళ్లలో ఇది లోయెస్ట్ ఓపెనింగ్ అయినా, బెటర్ ఓపెనింగ్స్ అనొచ్చు. ఎందుకంటే ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయిన రెండు వారాల తరువాత తెలుగులో రిలీజ్ అయింది.

అందువల్ల ఆల్రెడీ చాలా మంది ఆడియన్స్ ఒరిజినల్ వెర్షన్ ని చూసే ఉంటారు. ఇక ఈ సినిమా తెలుగులో 3.50 కోట్ల బిజినెస్ చేయగా 4 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. ఫస్ట్ డే వచ్చిన వసూళ్ళని తీసేయగా బ్రేక్ ఈవెన్ ఇవ్వాలంటే ఇంకా మూడున్నర కోట్లని రాబట్టాలి. అయితే ఈ శని, ఆది వారాలు వీకెండ్ కాబట్టి మంచి గ్రోత్ చూపిస్తే దాన్ని బట్టి కెప్టెన్ మిల్లర్ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు