Pooja hegde: ఆసుపత్రిలో పూజా హెగ్డే… అందుకే గుంటూరు కారం నుంచి అవుట్?

Pooja hegde

భాషలతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ పేరును అంటగట్టుకున్న హీరోయిన్ ఎవరా అంటే, ఫస్ట్ వచ్చే సమాధానం పూజా హెగ్డే. ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా, ఫ్లాపులు, డిజాస్టార్లే వినిపిస్తాయి కానీ, ఎప్పుడు కూడా హిట్, సూపర్ హిట్ అనే పేర్లను వినలేదు. తన 11 ఏళ్ల కెరీర్ లో చెప్పుకొదగ్గా హిట్స్ వచ్చాయంటే, అవి అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపూరంలో.., మహర్షి మాత్రమే అని చెప్పొచ్చు. అందులో రెండు సినిమాలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రినివాస్ దర్శకత్వంలో వచ్చినవే.

ఇటీవల కాలంలో పూజా హెగ్డేకు అన్ని ఫ్లాపు ఫలితాలే వచ్చాయి. దీంతో మరోసారి త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా చేసి ఓ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూసింది పూజా. అలా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమాలోకి ఎంట్రి ఇచ్చింది. పూజా పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, సడన్ గా గుంటూరు కారం మూవీ నుంచి పూజా హెగ్డేను తప్పించారు అంటూ వార్తలు వచ్చాయి. అలాగే పూజాను ఎవరూ తప్పించలేదు, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అంటూ మరి కొన్ని వార్తలు వచ్చాయి.

అయితే ఎవరికీ మాత్రం సరైన సమాధానం దొరకలేదు. ఇన్నాళ్లకు గుంటూరు కారం మూవీ నుంచి పూజా తప్పుకోవడంపై ఒక క్లారిటీ వచ్చింది. పూజా హెగ్డే గత కొన్ని నెలల నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్, బీస్ట్ సినిమాల సమయంలో ఆమెకు గాయం అయింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని సందర్భాల్లో ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది.

- Advertisement -

అయితే గుంటూరు కారం షూటింగ్ సమయంలో మోకాలి నొప్పి ఎక్కువ అయిందట. డాక్టర్లను సంప్రదించడంతో ఈ సారి సర్జరీ తప్పకుండా చేయాలని చెప్పారట. సర్జరీ తప్పని పరిస్థితులు ఎదురుకావడంతో గుంటూరు కారం నుంచి బ్రేక్ తీసుకుని సర్జరీ చేసుకుందని తెలుస్తోంది. అందుకే ఇతర ఆఫర్లు వచ్చినా, అన్నింటినీ రిజెక్ట్ చేస్తూ రెస్టు తీసుకుంటుందని టాక్. మోకాలి నొప్పి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు