Animal : ఈ మూవీలోని ప్యాలెస్ ఆ స్టార్ హీరోదా?

డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన “యానిమల్” చిత్రం బాక్స్ ఆఫీస్ ను అల్లాడిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన “యానిమల్” మూవీ మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సినీ విశ్లేషకులను అబ్బురపరిచింది. ఇప్పటికీ “యానిమల్” మూవీ గురించి, అందులో నటించిన నటీనటులు, సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా “యానిమల్” మూవీలో చూపించిన ప్యాలెస్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.

ఈ ప్యాలెస్ ఓ స్టార్ హీరోకు చెందినదని తెలుస్తోంది. “యానిమల్” మూవీలో కనిపించిన ఆ ప్యాలెస్ సెట్ కాదు. ఓ స్టార్ హీరోకు సంబంధించిన రియల్ ప్రాపర్టీ. ఆ నిజమైన ప్యాలెస్ లోనే “యానిమల్” మూవీ షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. మరి ఆ అద్భుతమైన ప్యాలెస్ ఏ హీరోకు చెందినది అంటే… బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ ప్రాపర్టీ. పటౌడీ కుటుంబానికి చెందిన ఈ ప్యాలెస్ లోనే యానిమల్ మూవీ షూటింగ్ జరిగింది.

నిజానికి సైఫ్ అలీ ఖాన్ ది రాజ కుటుంబం. ఇది ఆయన తాత ముత్తాతల నుంచి సైఫ్ కు వచ్చిన వారసత్వ ఆస్తి. ఇక ఆ ప్యాలెస్ విషయానికి వస్తే దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, అందులో ఏకంగా 150 రూమ్స్ ఉన్నాయట. ఇక ఈ అద్భుతమైన రాజ భవనం విలువ సుమారు 800 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ విషయం బాలీవుడ్ సినీ ప్రియులకు కొంతమందికి తెలుసు. కానీ సౌత్ ఆడియన్స్ కి మాత్రం చలాండికి తెలీదు. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాతో టాలీవుడ్ కు విలన్ గా పరిచయమైన సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరో. ఇప్పుడు ఇలా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు . కానీ సైఫ్ దశాబ్ద కాలానికి పైగానే బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగారు. ఇంత అద్భుతమైన విలువైన భవనం ఆయనకు చెందిందని తెలియడం అందరిని షాక్ కు గురిచేస్తుంది. కాగా “యానిమల్” మూవీ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లను చేరుకునే దిశగా దూసుకెళ్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు