Prabhas: స్పీడ్ పెంచిన ‘ఆదిపురుష్’ – ఈసారైనా మెప్పిస్తాడా..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ‘ఓం రౌత్’ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలో విడుదలైన ఈ సినిమా టీజర్ లో క్వాలిటీ వీఎఫెక్స్ తో ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేయటమే కాకుండా సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడింది. అత్యంత భారీ బడ్జెట్ రూపొందిన ఈ సినిమా టీజర్ నాసిరకంగా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గత సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడింది.

సినిమా క్వాలిటీపై తీవ్ర విమర్శలు రావటంతో జాగ్రత్త పడ్డ సినిమా యూనిట్ వీఎఫెక్స్ కి అవసరమైన మరమత్తులు చేయటం కోసం చాలా సమయం తీసుకొని మంచి క్వాలిటీతో ఆడియెన్స్ ని మెప్పించేలా సిద్ధం చేసారని సమాచారం అందుతోంది. జూన్ 16న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సిద్ధమైందని, డైరెక్టర్ ఓం రౌత్ ఇండస్ట్రీలోని తన సన్నిహితులు కొంతమందికి ఈ ట్రైలర్ ని చూపించగా వారు ఫిదా అయ్యారని సమాచారం అందుతుంది.

ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్, ‘జై శ్రీరామ్’ సాంగ్ బిట్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. గతంలో వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పేలా ఉన్నాయని డార్లింగ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా యూనిట్ కూడా ఔట్ ఫుట్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నామని అంటున్నారు. ఏది ఏమైనా సమయం తీసుకొని వీఎఫెక్స్ ని రీఎడిట్ చేయటం ఆదిపురుష్ సినిమాకి మంచిదే అయ్యిందని చెప్పాలి. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ నిడివి 3నిమిషాల 22సెకన్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. జూన్ 16విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ 40రోజుల కేటాయించనున్నాడని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు