Tollywood: పీఎస్ 2 పై ఆశలు వదిలేసుకున్న దిల్ రాజు – ఏజెంట్ కి కలిసొచ్చేనా..?

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి భారీ తారాగణంతో చారిత్రాత్మక నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1 తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని కథ ఒక మైనస్ అయితే, సినిమా ప్రమోషన్స్ ని ఎఫెక్టివ్ గా చేయకపోవటం ఇంకో మైనస్ అయ్యింది ఆ సినిమాకు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పీఎస్2 విడుదలకు సిద్ధంగా ఉంది. పీఎస్1 సినిమా లాగే పీఎస్2 కి కూడా ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో చేయలేదు సినిమా యూనిట్,దీంతో సినిమాపై మినిమమ్ హైప్ కూడా క్రియేట్ కాలేదు.

ఈ సినిమాపై తెలుగు ఆడియెన్స్ లో మాత్రమే కాకుండా సినిమా యూనిట్ లో ఆసక్తి లేనట్లు కనిపిస్తుంది. ఈ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్న దిల్ రాజు కూడా ఈ సినిమా ఆశలు వదిలేసుకున్నాడని స్పష్టం అవుతుంది. పీఎస్ 2 సినిమాతో పాటు రేపు రిలీజ్ అవుతున్న ఏజెంట్ సినిమాకి కూడా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు హైదరాబాద్ లో ఉన్న మెయిన్ థియేటర్లలో చాలావరకు ఏజెంట్ సినిమాకు కేటాయించటం ఇందుకు నిదర్శనం. అంతే కాకుండా నైజాం ఏరియాలో ఎక్కువ శాతం థియేటర్లు ఏజెంట్ సినిమాకే కేటాయించాడట.

ఈ క్రమంలో దిల్ రాజు ముందు జాగ్రత్త పడటం పరోక్షంగా ఏజెంట్ సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. అఖిల్ కెరీర్లోనే అత్యధికంగా 80కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమాకు వీలైనన్ని ఎక్కువ థియేటర్లు దొరకడంతో ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ మాత్రం హైప్ లేని పీఎస్2, భారీ అంచనాలతో వస్తున్న ఏజెంట్ సినిమాలు ఏ మేరకు అలరిస్తాయి వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు