Tillu Square : 100 కోట్లు పక్కా అంటున్న నాగ వంశీ… పార్ట్ 3 టైటిల్ ఫిక్స్

Tillu Square : ఈరోజే థియేటర్లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ సక్సెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు చిత్ర బృందం. నిర్మాత నాగ వంశీ సక్సెస్ మీట్ లో ఈ మూవీ కలెక్షన్స్, ఐపీఎల్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలాగే పార్ట్ 3పై క్లారిటీ ఇస్తూ టైటిల్ ను కూడా ఖరారు చేశారు. మరి ఇంతకీ నాగ వంశీ చెప్పుకొచ్చిన ఆ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఏంటి? పార్ట్ 3 టైటిల్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

కలెక్షన్స్ పై ఐపీఎల్ ఎఫెక్ట్…

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ ( Tillu Square ) మూవీ మార్చ్ 29న రిలీజ్ అయింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఊరించి ఊరించి మొత్తానికి టిల్లు స్క్వేర్ ను థియేటర్లలోకి దించారు మేకర్స్. భారీ అంచనాలతో ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీకి 100 కోట్ల కలెక్షన్లు రావడం పక్కా అంటున్నారు ప్రొడ్యూసర్ నాగ వంశీ. పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే జరిగాయి. మొత్తానికి అన్నీ కలిపి చూసుకుంటే మూవీకి మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అలాగే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయగా, నిర్మాత నాగ వంశీ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ మొదటి రోజే 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. యూఎస్ ప్రీమియర్స్ గ్రాస్ 5 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని, నైజాం ఏరియాలో ఈ మూవీకి 7 నుంచి 8 కోట్ల కలెక్షన్లు రావచ్చని అన్నారు. మరోవైపు వీలైనన్ని చోట్ల ఎక్కువ షోలను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, థియేటర్ రన్ ముగిసే టైంకు ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. మ్యాట్నీ షోలకు డిమాండ్ పెరగడంతో రానున్న రోజుల్లో ఈ మూవీ ఎలా ఆడబోతుందో చెప్పుకోచ్చారు నాగ వంశీ. ఈ సమ్మర్ లో పెద్దగా రిలీజ్ లు ఏమీ లేవనీ, అంతేకాకుండా ఉగాది, రంజాన్ లాంటి పండగలు కూడా తమకు కలిసి వస్తాయని, ఐపీఎల్ అనేది సినిమాలపై ప్రభావం చూపదనే అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు నాగ వంశీ. ఐపీఎల్ కూడా వరల్డ్ కప్ లాగే మన జీవితాల్లో ఒక భాగమైంది కాబట్టి అది సినిమాపై పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండకపోవచ్చు అని అన్నారాయన.

పార్ట్ 3 పై క్లారిటీ ఇచ్చిన నాగ వంశీ…

ఈ సందర్భంగానే నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ డీజే టిల్లు పార్ట్ 3 కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా నెక్స్ట్ సీక్వెల్ టైటిల్ ను ఇప్పుడే రివీల్ చేశారు. టిల్లు క్యూబ్ పేరుతో నెక్స్ట్ పార్ట్ రాబోతుందని, త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తామని ప్రకటించారు నాగవంశీ. దీంతో టిల్లు సినీమాటిక్ యూనివర్స్ క్రియేట్ అవుతుందంటూ సిద్దు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. మూడవ భాగంలో హీరోయిన్ ఎవరు? ఏ డైరెక్టర్ తెరకెక్కిస్తారు? అనే వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు