టాలీవుడ్ లో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేసే హీరోల్లో గోపీచంద్ ఒకరు. గత ఏడాది సీటీ మార్, ఆరడుగుల బుల్లెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాల కూడా అశించిన స్థాయిలో ఆడలేదు. కాగ ఈ సంవత్సరం పక్కా కమర్షియల్ తో పాటు లక్ష్యం, లౌక్యం సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీవాస్ తో గోపీచంద్ తన కెరీర్ లో 30వ సినిమా చేస్తున్నాడు.
గోపీచంద్ 30వ సినిమాలో ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ సమయంలో.. గోపీ చంద్ డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో నటించే క్రమంలో కాలు జారీ కింద పడ్డాడు. కాస్త ఎత్తైనా లోకేషన్ నుంచి పడటంతో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో హీరో గోపీచంద్ కు తీవ్ర గాయాలు అయ్యాయని.. హాస్పటల్ చికిత్స అందిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ ప్రమాదంతో షూటింగ్ కూడా నిలిచిపోయింది. దీనిపై చిత్ర బృందం.. ప్రమాదం జరిగింది వాస్తవమే.. కానీ హీరోకు ఎలాంటి గాయాలు కాలేదని అనౌన్స్ చేసి సైలెంట్ మోడ్ లో ఉంది. దీంతో ఫ్యాన్స్.. గోపీచంద్ కు ఏం జరిగిందో తెలియాక టెన్షన్ పడుతున్నారు.
అయితే టాలీవుడ్ హీరోలు అందరూ భారీ యాక్షన్ సీన్స్ డూప్ తోనే చేస్తారు. మహేష్ బాబు, రవితేజ, చిరంజీవి తో పాటు యంగ్ హీరోలు కూడా కొన్ని సందర్భాల్లో డూప్ ను వాడుతారు. అయితే నాలుగు పదులు వయస్సు ఉన్న గోపీచంద్ డూప్ లేకుండానే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. గతంలో పలువురు హీరోలు కూడా ఇలాగే ప్రమాదం బారీన పడ్డారు. ఈ అనుభావాలను దృష్టిలోపెట్టుకోకుండా.. గోపీ చంద్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు.