Allu Arjun : బాలీవుడ్ లో ‘శెట్టి’ యూనివర్స్

లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఈ లిస్ట్ లో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి చేరడానికి రెడీ అవుతున్నాడు. ఏ లిస్ట్ అనేది ఇప్పటికే అర్థమైంది కావచ్చు. అదేనండి ప్రస్తుతం సౌత్ లో ఎక్కువగా వినిపిస్తున్న సినిమాటిక్ యూనివర్స్. లోకీ యూనివర్స్ అంటూ లోకేష్ కనగరాజ్ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ తెలుగులోకి రావడం.. దానిలో సినిమాలు ప్రారంభించడం, రిలీజ్ చేయడం వరకు వచ్చింది. తాజాగా ఈ ట్రెండ్.. బాలీవుడ్ వరకు పాకింది.

బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తన శెట్టి యూనివర్స్ ను క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాడట. రోహిత్ శెట్టి ఇటీవల తెలుగులో వచ్చిన టెంపర్ సినిమాను సింబా ను రణ వీర్ తో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అలాగే అక్షయ్, అజయ్ దేవగన్ లతో సూర్యవంశీ అనే సినిమా చేసి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా రణవీర్ తో సర్కస్ అనే చిత్రం చేశాడు. ఇది రిలీజ్ సిద్ధంగా ఉంది.

దీని తర్వాత రోహిత్ శెట్టి తన సినిమాటిక్ యూనివర్స్ ను డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సూపర్ పోలీస్ లు కాన్సెప్ట్ తో భారీ స్థాయిలో మల్టీ స్టారర్స్ ప్లాన్ చేయాలని రోహిత్ శెట్టి ఆలోచిస్తున్నాడట. దీనిలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా ఉపయోగించుకోవాలని ట్రై చేస్తున్నట్టు టాక్. ఇటీవల సర్కస్ ప్రమోషన్ లో సౌత్ నుంచి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాట చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

అల్లు అర్జున్ తో పాటు కార్తీ-రణవీర్ సింగ్ ఈ సినిమాలో ఉంబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. అంతే కాదు.. ఈ సినిమాలో అక్షయ్-అజయ్ దేవగన్ లను అతిథి పాత్రలో తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఇంత మంది స్టార్లు ఒకే సినిమాలో ఉంటే.. పాన్ ఇండియా స్థాయిలో హైప్ ఆ పై విజయం ఖాయమని ప్రేక్షకులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు