Tollywood Heros : ఈ హీరోలు మిస్సింగ్… ఎక్కడైనా చూశారా?

స్టార్ వారసులకు ఇండస్ట్రీలో రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే వారికి ఇది దాదాపుగా అసాధ్యం. టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు దొరకడం మాత్రం అరుదుగా జరుగుతుంది. అయితే స్టార్ వారసులు సినీ ఇండస్ట్రీలో లాంచ్ అవ్వడానికి పెద్ద అడ్డంకులు ఏమీ ఉండవు. కానీ ఆ వారసత్వం అనేది ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వదు. కాబట్టి సరైన కథలను ఎంచుకొని, తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తేనే స్టార్ వారసులైనప్పటికీ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగుతారు. వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంటేనే స్టార్ స్టేటస్ వస్తుంది. లేదంటే కొన్నాళ్లకు తెరమరగు అవ్వక తప్పని పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోని కొందరు స్టార్ వారసుల విషయంలో ఇదే జరిగింది. అక్కినేని అఖిల్, నాగశౌర్య, వైష్ణవ్ తేజ్, బెల్లంకొండ వారసులు, అల్లు శిరీష్ వంటి హీరోలు ఇటీవల కాలంలో వెండితెరకు దూరమయ్యారు. సినిమాలు కాదు కదా కనీసం కళ్ళకు కనిపించడం కూడా గగనమే అయ్యింది.

1. అక్కినేని అఖిల్
ఏజెంట్ మూవీ ఈ హీరో ఇమేజ్ ను బాగా డామేజ్ చేసింది. దీంతో అఖిల్ నెక్స్ట్ మూవీ విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ ఓ మూవీ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటిదాకా దాని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అక్కినేని వారసుడు అఖిల్ ఇంకెంత కాలం అజ్ఞాతవాసం చేస్తాడో మరి.

2. అల్లు శిరీష్
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడైన అల్లు శిరీష్ అసలు ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. సినిమాల గురించి ఆయన నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో ?

- Advertisement -

3. శ్రీ సింహ
కీరవాణి తనయుడైన శ్రీ సింహ ఇప్పటిదాకా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత ఇదంతా వృధా ప్రయత్నం అనుకున్నాడో ఏమో కానీ కనీసం ఎవరైనా కథ చెప్పాలనుకున్నా కూడా వారికి అందుబాటులో లేడని సమాచారం.

4. సుశాంత్
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ వెండి తెరపై కనిపించి చాలా కాలమే అవుతుంది. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే మూవీలో చివరిసారిగా నటించాడు సుశాంత్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఏం చేస్తున్నాడో ఎవ్వరికి తెలియదు.

5. నాగశౌర్య
ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నాడు. సరైన కథలు రాకపోవడంతో వెయిటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

6. వైష్ణవ్ తేజ్
మెగా క్యాంప్ హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ డిజాస్టర్ తో ఆలోచనలో పడ్డట్టున్నాడు. ఆ మూవీ తర్వాత ఇప్పటిదాకా కొత్త సినిమాను ప్రకటించలేదు.

7. బెల్లంకొండ వారసులు
నిర్మాత బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి ఆయన ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళిద్దరూ కథలు వింటున్నారు అనే టాక్ నడుస్తోంది తప్ప ఇప్పటిదాకా ఏది మెటీరియలైజ్ అయిన దాఖలాలే లేవు. వీళ్లతోపాటు సత్యదేవ్, రాజ్ తరుణ్, కార్తికేయ గుమ్మకొండ వంటి చాలామంది యంగ్ హీరోలు సరైన ఆఫర్లు రాక ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్నారు. 2025 నాటికి మేలుకోకపోతే, నాన్ థియేటర్, థియేటర్ మార్కెట్ ను సెట్ చేసుకోకపోతే వీళ్లంతా కనుమరుగయ్యే ప్రమాదం ఎక్కువగానే ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు