Yodha On OTT : రాశి ఖన్నా బాలీవుడ్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్… ఏ ఓటిటిలో ఉందంటే?

Yodha On OTT : సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా నటించిన బాలీవుడ్ యాక్షన్ మూవీ యోధ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఇంతకీ ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళ్తే…

ఫ్లాప్ సినిమా రెంటల్ విధానంలో..

సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, రాశి ఖన్నా, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధ. కరణ్ జోహార్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించగా, రొటీన్ స్టోరీ కారణంగా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఈ మూవీని ఓటిటిలో ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో రిలీజ్ చేయడం గమనార్హం. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టింది. అయితే ప్రైమ్ వీడియోలో యోధ మూవీని చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తో పాటు మరో 349 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.

యోధ స్టోరీ ఇదే?

టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్న కుట్రలను అడ్డుకోవడానికి ప్రభుత్వం యోధ పేరుతో ఒక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేస్తుంది. అందులోనే అరుణ్ సైనికుడిగా పని చేస్తాడు. అయితే టెర్రరిస్టులు ఓ ఫ్లైట్ ను హైజాక్ చేసి ప్రయాణికులను బందీలుగా మారుస్తారు. ఈ హైజాక్ నుంచి ప్యాసింజర్ లను అరుణ్ ఎలా కాపాడాడు? అరుణ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రియంవద ఎవరు? ఈ పోరాటంలో లైలా పాత్ర ఏంటి? అనే అంశాలతో సాగర్ ఆంబ్రె, పుష్కర్ ఓజా అనే దర్శకద్వయం యోధ ఈ మూవీని రూపొందించారు.

- Advertisement -

సినిమాకు అడ్డంకులు…

యోధ మూవీ ఎన్నో అడ్డంకులను దాటుకొని థియేటర్లలోకి వచ్చింది. 2021లోనే ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేసినా ప్రేక్షకుల ముందుకు రావడానికి 2024 మార్చ్ దాకా ఆగాల్సి వచ్చింది. కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు థియేటర్లలోకి రావడం, ఆ తర్వాత 40 రోజులకు ఓటిటి రిలీజ్ కు నోచుకోవడం జరిగింది.

11 ఏళ్ల తర్వాత రాశి బాలీవుడ్ లో…

రాశి ఖన్నా 2013లో మొదటిసారిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మద్రాస్ కేఫ్ అనే మూవీ తో ఈ బ్యూటీ బాలీవుడ్ లోనే కెరీర్ ను స్టార్ట్ చేసింది. కానీ ఊహలు గుసగుసలాడే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో స్థిరపడిపోయింది. ఆ తర్వాత 11 ఏళ్ల లాంగ్ గ్యాప్ తీసుకున్న రాశి ఖన్నా రీసెంట్ గా యోధ మూవీతో మళ్లీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు మరో రెండు సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అజయ్ దేవగన్ సరసన రుద్ర అనే వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో మెరిసింది రాశి ఖన్నా. తమిళంలో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న రాశికి టాలీవుడ్ మేకర్స్ నుంచి మాత్రం పిలుపు రావట్లేదు. ఆమె నటించిన బాక్ అనే మూవీ మే 3 న థియేటర్లలోకి రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు