Yashoda Trailer : యశోద ఎవరో తెలుసు కదా..

సమంత ప్రధాన పాత్రలో చేస్తున్న తాజా సినిమా యశోద. హరి-హరిష్ దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న సన్స్ ఫిక్షన్ థ్రిలర్ మూవీ యశోద. పాన్ ఇండియా రేంజ్ గా వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ కూడా అలాంటి హైప్ నే క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మూవీ టీం రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంఛ్ ను కూడా మూవీ టీం భారీ స్థాయిలో ప్లాన్ చేశారు.

తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీని కోసం రెండు రోజుల ముందు నుంచే ప్రమోషన్లు ప్రారంభించారు. దీంతో ట్రైలర్ కే మంచి హైప్ క్రియేట్ అయింది. ఇదిలా ఉండగా ఇంత భారీ హైప్ తో వచ్చిన యశోద ట్రైలర్ ఎలా ఉందో ఎప్పుడు చూద్ధాం.

“మీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పులు వినిపించాయా? బిడ్డను కడపులో మోస్తున్న తల్లికి మాత్రమే వినిపిస్తుంది” అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్.. “నీవు కనే బిడ్డ ఏ బిలియనీర్ ఇంటికో.. బిగ్ షాట్ ఇంటికో వెళ్తుంది. ఆ బిడ్డను ఆరోగ్యంగా, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాది” అంటూ సమంతతో అంటుంది. ఈ డైలాగ్ తో ఈవా ఆస్పత్రిని వరలక్ష్మీ శరత్ కుమార్ రన్ చేస్తుందని తెలుస్తోంది. దీని తర్వాత ట్రైలర్ మొత్తం సస్పెన్స్, సమంత యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. చివరికి “యశోద ఎవరో తెలుసుకదా.. ఆ కృష్ణ పరమాత్ముని పెంచిన తల్లి” అనే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది.

- Advertisement -

యశోద ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగింది. సరోగసి ఒప్పందం చేసుకున్న ఒక యువతి ఎదుర్కొన్న సమస్యలను ఈ సినిమాలో చూపించారు. సరోగసి ఒప్పందం చేసుకున్న వారిని ప్రత్యేకంగా ఈవా ఆస్పత్రిలో పెట్టి, వారి బాగోగులు చూస్తారు. అందులో యశోద (సమంత) కూడా ఉంటుంది. అయితే ఆ ఆస్పత్రిలో యశోద ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? ఇంతకి ఆ ఆస్పత్రి ఎవరిది ? ఆ ఆస్పత్రిలో ఏం జరుగుతుంది ? అని తెలియాలంటే నవంబర్ 11న రిలీజ్ కాబోయే సినిమాను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు