Pre Release Event : గెస్ట్ ఎవరు ?

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకుగా ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. మలయాళ, తమిళ భాషలలో సినిమాలు చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దుల్కర్ తొలిసారి తెలుగులో మహానటి సినిమాలో నటించాడు. దీని తర్వాత మలయాళంలో చేసిన సినిమాలను తెలుగులో డబ్ చేశాడు. ఇప్పుడు సీతా రామం అనే సినిమాతో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తో పాటు సుమంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సీతా రామం మంచి లవ్ స్టోరీగా ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా, ఈ సినిమా ఈ నెల 5న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో విడుదల కానుంది. దానికోసం ప్రమోషన్లను కూడా మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. జూలై 31న విజయవాడ, వైజక్ ను సీతారామం టీం చూట్టి వచ్చింది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధమవుతుంది. రేపు సాయంత్రం 7 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఈ ఈవెంట్ కు ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తారని ప్రచారం సాగింది. నిర్మాత అశ్వినీ దత్ కూడా ప్రభాస్ పై క్లారిటీ ఇచ్చాడు. సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావాల్సిందని, కానీ ప్రభాస్ కు సర్జరీ కారణంగా రాలేకపోతున్నాడని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, ఇప్పుడు సీతారామం కోసం ఏ స్టార్ హీరో వస్తాడో అని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు